Telangana

మత్స్యకారుల‌కు చేప పిల్ల‌ల‌ను ఉచితంగా పంపిణీ చేసిన_చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్

అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట

మనవార్తలు ,ప‌టాన్ చెరు:

రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చొరవ, ప్రత్యేక కృషితో తెలంగాణ రాష్ట్రంలో మత్స్యవిప్లవం వచ్చిందని పటాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. శుక్రవారం ఆయన ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చిట్కుల్ గ్రామంలో మత్స్యశాఖ అధికారులతో కలిసి 50 వేల చేప పిల్లలను ఎర్రకుంటలో వదిలారు. రాష్ట్ర ప్రభుత్వమే మత్స్యకారులు, ముదిరాజ్ సోదరులకు ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేస్తుందన్నారు. గతంలో పోల్చితే తెలంగాణలో ఏ గ్రామానికి వెళ్లినా చెరువుల్లో చేపలు కనిపిస్తున్నాయన్నారు. ఒక్క చేపలే కాకుండా అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

గ్రామంలోని 3వ వార్డులో సీసీ నిర్మాణానికి ఆయన శంఖుస్థాపన చేశారు. అలాగే గురుకుల పాఠశాలను సందర్శించారు. విద్యార్ధులు, ఉపాధ్యాయులతో మాట్లాడి ఎమైనా ఇబ్బందులున్నాయా..? అని అడిగి తెలుసుకున్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో పల్లెలు, పట్టణాలు ఆదర్శంగా మారుతున్నాయన్నారు. చిట్కుల్ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తున్నాయని, ప్రజల ఆదరాభిమానాలను ఎప్పటికీ మరచిపోనని నీలం మధు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఉప సర్పంచ్ విష్ణువర్థన్ రెడ్డి, వార్డు సభ్యులు కష్ణ, శ్రీను, మురళి, రాజ్ కుమార్, వెంకటేష్, ఆంజనేయులు, పీఏసీఎస్ చైర్మన్ నారాయణరెడ్డి లతో పాటు గ్రామ పెద్దలు, అధికారులు పాల్గొ్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

7 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

7 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

8 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

3 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

3 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

3 days ago