Telangana

మత్స్యకారుల‌కు చేప పిల్ల‌ల‌ను ఉచితంగా పంపిణీ చేసిన_చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్

అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట

మనవార్తలు ,ప‌టాన్ చెరు:

రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చొరవ, ప్రత్యేక కృషితో తెలంగాణ రాష్ట్రంలో మత్స్యవిప్లవం వచ్చిందని పటాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. శుక్రవారం ఆయన ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చిట్కుల్ గ్రామంలో మత్స్యశాఖ అధికారులతో కలిసి 50 వేల చేప పిల్లలను ఎర్రకుంటలో వదిలారు. రాష్ట్ర ప్రభుత్వమే మత్స్యకారులు, ముదిరాజ్ సోదరులకు ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేస్తుందన్నారు. గతంలో పోల్చితే తెలంగాణలో ఏ గ్రామానికి వెళ్లినా చెరువుల్లో చేపలు కనిపిస్తున్నాయన్నారు. ఒక్క చేపలే కాకుండా అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

గ్రామంలోని 3వ వార్డులో సీసీ నిర్మాణానికి ఆయన శంఖుస్థాపన చేశారు. అలాగే గురుకుల పాఠశాలను సందర్శించారు. విద్యార్ధులు, ఉపాధ్యాయులతో మాట్లాడి ఎమైనా ఇబ్బందులున్నాయా..? అని అడిగి తెలుసుకున్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో పల్లెలు, పట్టణాలు ఆదర్శంగా మారుతున్నాయన్నారు. చిట్కుల్ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తున్నాయని, ప్రజల ఆదరాభిమానాలను ఎప్పటికీ మరచిపోనని నీలం మధు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఉప సర్పంచ్ విష్ణువర్థన్ రెడ్డి, వార్డు సభ్యులు కష్ణ, శ్రీను, మురళి, రాజ్ కుమార్, వెంకటేష్, ఆంజనేయులు, పీఏసీఎస్ చైర్మన్ నారాయణరెడ్డి లతో పాటు గ్రామ పెద్దలు, అధికారులు పాల్గొ్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

10 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

10 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

10 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

10 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

10 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

10 hours ago