_జిహెచ్ఎంసి డివిజన్ల అభివృద్ధికి నిధులు కేటాయించండి
_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
మనవార్తలు ,పటాన్ చెరు:
జిహెచ్ఎంసి పరిధిలోని పటాన్ చెరు, భారతి నగర్, రామచంద్రపురం డివిజన్ల పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు సత్వరమే నిధులు కేటాయించాలని బల్దియ కమిషనర్ లోకేష్ కుమార్ ను పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు.డివిజన్లో అభివృద్ధికి నిధుల కేటాయింపు అంశంపై ఇటీవల రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తో ఎమ్మెల్యే జిఎంఆర్ నేతృత్వంలోని కార్పొరేటర్ల బృందం సమావేశమైన విషయం అందరికీ తెలిసిందే. మంత్రి ఆదేశాల మేరకు శుక్రవారం హైదరాబాదులోని బల్దియా కార్యాలయంలో కమిషనర్ లోకేష్ కుమార్ తో సమావేశమయ్యారు.పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఏర్పడుతున్న కాలనీలలో మౌలిక వసతుల నిధులు, కేటాయించడంతోపాటు, పటాన్ చెరు ఫుట్ ఓవర్ బ్రిడ్జి , వరద నీటి కాలువల నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరినట్లు ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన వెంటనే త్వరితగతిన పనులు చేపడతామని ఆయన తెలిపారు.
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…