Telangana

రక్తదానం నిర్వహించడం అభినందనీయం

గుమ్మడిదలలో మిలాద్ మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

గుమ్మడిదల ,మనవార్తలు ప్రతినిధి :

ఐదు సంవత్సరాలుగా మిలాద్ ఉన్ నబీ పర్వదినం పురస్కరించుకొని వాయిస్ ఆఫ్ ముస్లిం యూత్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ ప్రతి ఒక్కరిలో రక్తదానంపై చైతన్యం పెంపొందించడం అభినందనీయమని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మిలాద్ ఉన్ నబి పర్వదినం పురస్కరించుకొని.. గుమ్మడిదల మున్సిపల్ పరిధిలో ప్రైవేటు ఫంక్షన్ హాలులో వాయిస్ ఆఫ్ ముస్లిం యూత్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మిలాద్ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపును ఆదివారం ఉదయం ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అన్ని దానాలలో కన్నా రక్తదానం మహా గొప్పదని అన్నారు. ఐదు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తూ.. రక్తదానం విశిష్టతను ప్రచారం చేయడం పట్ల ఆయన నిర్వాహకులను అభినందించారు. రక్తదానంతో పాటు వివిధ సమాజసేవ కార్యక్రమాలు చేయాలని ఆయన సూచించారు. రక్తదానం ద్వారా మనిషి శరీరంలో ఆరోగ్యకరమైన మార్పులు చోటు చేసుకుంటాయని తెలిపారు. రక్తదానం చేసిన యువకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో గుమ్మడిదల మాజీ జెడ్పిటిసి కుమార్ గౌడ్, సీనియర్ నాయకులు విజయభాస్కర్ రెడ్డి, షేక్ హుస్సేన్, సిఐ నయీముద్దీన్, స్వచ్ఛంద సంస్థ సభ్యులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

3 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

3 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago