రెండు లక్షల రూపాయల సొంత నిధులతో సాయి భగవాన్ కాలనీలో సీసీ కెమెరాల ఏర్పాటు ప్రారంభం
త్వరలో అందుబాటులోకి మినీ ఫంక్షన్ హాల్, పార్కు
అమీన్పూర్ ,మనవార్తలు ప్రతినిధి :
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఏర్పాటవుతున్న నూతన కాలనీలలో భద్రతను పెంచడంలో కమ్యూనిటీ సీసీ కెమెరాలు ఎంతగానో ఉపకరిస్తాయని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని న్యూ సాయి భగవాన్ కాలనీలో రెండు లక్షల రూపాయల సొంత నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆదివారం ఉదయం ఎమ్మెల్యే జి.ఎం.ఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేరాల నియంత్రణతో పాటు నేరగాళ్లను గుర్తించటంలో సీసీ కెమెరాలు పోలీసు శాఖకు కీలకంగా ఉపయోగపడుతున్నాయని అన్నారు. ప్రతీ కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవటం ద్వారా నిరంతర నిఘాకు ఆస్కారం ఉంటుందన్నారు. ప్రధాన కేసుల చేదనలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ప్రతి సీసీ కెమెరాను అనుసంధానం చేసి భద్రతాపరమైన సమస్యలు తలెత్తినప్పుడు క్షణాల్లో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునేలా నూతన అమలులోకి తీసుకొని వచ్చిందని తెలిపారు. శర వేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్చెరు నియోజకవర్గంలో ప్రతి గ్రామం, పట్టణం, డివిజన్లలో కమ్యూనిటీ సీసీ కెమెరాలు ఏర్పాటుకు కృషి చేస్తున్నామని తెలిపారు. కాలనీ ప్రజల కోసం అతి త్వరలో మినీ ఫంక్షన్ హాల్, పార్కును ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, సిఐ నరేష్, సీనియర్ నాయకులు మల్లేష్, బాలరాజు, ప్రమోద్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి, కృష్ణ, జగదీష్, దాసు, కాలనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…