Telangana

సాయిబాబా సెల్యులోజ్ పరిశ్రమలో చేయి కోల్పోయిన కార్మికుని కుటుంబాన్ని ఆదుకోవాలి

సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్ చెరు పారిశ్రామిక వాడలో గల సాయిబాబా సెల్యులోజ్ పరిశ్రమలో ప్రెస్సింగ్ మిషన్లో పనిచేస్తూ కుడి చేతిని కోల్పోయిన అమర్ సింగ్ కుటుంబానికి యాజమాన్యం నష్టపరిహారం చెల్లించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు పరిశ్రమ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. శనివారం పరిశ్రమ తో పాటు పటాన్ చెరు పట్టణంలోని అమర్ సింగ్ చికిత్స తీసుకుంటున్న ధ్రువ హాస్పిటల్ ను సందర్శించడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ సెల్యులోజ్ పరిశ్రమలో అమర్ సింగ్ గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడని అన్నారు. విధి నిర్వహణలో భాగంగా శుక్రవారం జనరల్ షిఫ్ట్ కు వెళ్ళగా మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ప్రెస్సింగ్ మిషను లో ఆపరేట్ చేసే క్రమంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా సేఫ్టీ పరికరాలు ఇవ్వకపోవడంతో అమర్ సింగ్ చేసే క్రమంలో తన కుడిచేయిని కోల్పోవలసి వచ్చిందని వాపోయారు. ప్రమాదం జరిగి రోజు గడిచిపోయినప్పటికీ జరిగిన సంఘటనను యాజమాన్యం పూర్తిగా దాచిపెట్టే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. వైద్య ఖర్చు లు ఇవ్వకుండా చేతులు దులుపుకునే ప్రయత్నం యజమాన్యం చేస్తుందని, అమర్ సింగ్ వైద్య ఖర్చులన్నీ పరిశ్రమ యాజమాన్యం పూర్తిగా భరించడంతోపాటు తన కుడి చేతిని కోల్పోవడంతో అమర్ సింగ్ కుటుంబం పూర్తిగా రోడ్డు మీద వచ్చిందని, కార్మిక శాఖ, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శాఖల అధికారులు వెంటనే స్పందించి కుటుంబాన్ని పూర్తిస్థాయిలో ఆదుకోవడం తోపాటు యాజమాన్యంను కఠినంగా శిక్షించేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అమర్ సింగ్ కుటుంబం రోడ్డున పడకుండా పరిశ్రమ యాజమాన్యం 30 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని, పరిశ్రమలో పనిచేస్తున్న ఏ ఒక్క కార్మికునికి కూడా ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు అందడం లేదని, జిల్లా అధికార యంత్రాంగం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని లేనిపక్షంలో బాధితుడు కుటుంబం తరపున పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని ఈ సందర్భంగా హెచ్చరించారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

7 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

7 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

7 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

3 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

3 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

3 days ago