గుమ్మడిదలలో మిలాద్ మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్
గుమ్మడిదల ,మనవార్తలు ప్రతినిధి :
ఐదు సంవత్సరాలుగా మిలాద్ ఉన్ నబీ పర్వదినం పురస్కరించుకొని వాయిస్ ఆఫ్ ముస్లిం యూత్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ ప్రతి ఒక్కరిలో రక్తదానంపై చైతన్యం పెంపొందించడం అభినందనీయమని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మిలాద్ ఉన్ నబి పర్వదినం పురస్కరించుకొని.. గుమ్మడిదల మున్సిపల్ పరిధిలో ప్రైవేటు ఫంక్షన్ హాలులో వాయిస్ ఆఫ్ ముస్లిం యూత్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మిలాద్ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపును ఆదివారం ఉదయం ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అన్ని దానాలలో కన్నా రక్తదానం మహా గొప్పదని అన్నారు. ఐదు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తూ.. రక్తదానం విశిష్టతను ప్రచారం చేయడం పట్ల ఆయన నిర్వాహకులను అభినందించారు. రక్తదానంతో పాటు వివిధ సమాజసేవ కార్యక్రమాలు చేయాలని ఆయన సూచించారు. రక్తదానం ద్వారా మనిషి శరీరంలో ఆరోగ్యకరమైన మార్పులు చోటు చేసుకుంటాయని తెలిపారు. రక్తదానం చేసిన యువకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో గుమ్మడిదల మాజీ జెడ్పిటిసి కుమార్ గౌడ్, సీనియర్ నాయకులు విజయభాస్కర్ రెడ్డి, షేక్ హుస్సేన్, సిఐ నయీముద్దీన్, స్వచ్ఛంద సంస్థ సభ్యులు పాల్గొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…