_టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మహిళా సాధికారికత
_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మహిళా సాధికారత సాధ్యమైందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని పటాన్చెరు నియోజకవర్గ స్థాయి మహిళా క్రీడా పోటీలను శుక్రవారం ఉదయం పటాన్చెరువు పట్టణంలోని మైత్రి మైదానంలో ఎమ్మెల్యే జిఎంఆర్ క్రీడాజ్యోతి వెలిగించి లాంచనంగా ప్రారంభించారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళల కోసం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కెసిఆర్ కిట్ లాంటి వినూత్న పథకాలతో పాటు అన్ని రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తున్నారని అన్నారు. పారిశ్రామిక రంగంలో మహిళా పారిశ్రామికవేత్తలకు సబ్సిడీపై రుణాలు అందించడంతోపాటు ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం అందిస్తున్నారని అన్నారు. ఎంపీపీగా ఉన్నప్పటినుండి నేటి వరకు మహిళా దినోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలో మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, మహిళ ఉద్యోగినులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…