_గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ..
_జాతీయ రహదారిపై వంటావార్పు
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పెంచిన వంట గ్యాస్ ధరను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్ పిలుపుమేరకు.. పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పటాన్చెరు పట్టణంలోని జాతీయ రహదారిపై భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసి, వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ మోడీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు 150 శాతం గ్యాస్ ధరలను పెంచిన ఘనత ప్రధాని మోడీకే దక్కిందన్నారు. కార్పోరేట్ సంస్థలకు రెడ్ కార్పెట్ పరుస్తూ పేదల పాలిట పెనుభూతంగా మారిందని దుయ్యబట్టారు. చమురు ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మూలంగా ప్రజలు చివరకు మళ్లీ కట్టెల పొయ్యి పై వంటలు చేసుకునే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయన్నారు. సామాన్యుడు బతకలేని పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రధాని మోడీని గద్దె దించే వరకు పోరాటం సాగుతూనే ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నాయి.
గీతం స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభోత్సవంలో డాక్టర్ రిచా శర్మ మనవార్తలు ప్రతినిధి ,…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: ఆహారం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అది ఎప్పుడూ డిమాండ్ బిజినెస్. అందుకే ఆహారంలో…
“కాళేశ్వరం నిజం బయటపడింది బీఆర్ఎస్ ఆరోపణలకు న్యాయబలం” “రైతులను మోసం చేసింది ఎవరు _ ప్రభుత్వం సమాధానం చెప్పాలి ప్రజల…
పరిశోధనాంశాలను వివరించిన సైకాలజీ అధ్యాపకురాలు డాక్టర్ అఫ్రిన్ వసీం మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మహిళలు భయం లేకుండా…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : ఆర్టీసీ కార్మికుల తమ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని హెచ్సీయూ డిపో మరియు మియాపూర్…
గీతం కార్యశాలలో కార్పొరేట్ శిక్షకురాలు జూజర్ (జె) సూచన మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రభావవంతమైన కథనం భావోద్వేగపరంగా…