Telangana

ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో మహా నిరసన ప్రదర్శన

_గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ..

_జాతీయ రహదారిపై వంటావార్పు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

పెంచిన వంట గ్యాస్ ధరను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్ పిలుపుమేరకు.. పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పటాన్చెరు పట్టణంలోని జాతీయ రహదారిపై భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసి, వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ మోడీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు 150 శాతం గ్యాస్ ధరలను పెంచిన ఘనత ప్రధాని మోడీకే దక్కిందన్నారు. కార్పోరేట్ సంస్థలకు రెడ్ కార్పెట్ పరుస్తూ పేదల పాలిట పెనుభూతంగా మారిందని దుయ్యబట్టారు. చమురు ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మూలంగా ప్రజలు చివరకు మళ్లీ కట్టెల పొయ్యి పై వంటలు చేసుకునే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయన్నారు. సామాన్యుడు బతకలేని పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రధాని మోడీని గద్దె దించే వరకు పోరాటం సాగుతూనే ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నాయి.

admin

Recent Posts

ఫ్యూజన్ ఫిట్‌నెస్ స్టూడియో ఆధ్వర్యంలో ప్రత్యేక యోగా

మనవార్తలు ప్రతినిధి , రామచంద్రపురం : యోగాతో శరీరం, మనస్సు, ఆత్మకు సమతుల్యత లభిస్తుందని భారతీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్…

7 hours ago

యండిఆర్ ఫౌండేషన్ కు 23వ జాతీయ అవార్డు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: సామాజిక సేవ కార్య‌క్ర‌మాల నిర్వ‌హిస్తున్న ఎండీఆర్ ఫౌండేష‌న్ ఖాతాలో మ‌రో అవార్డు ద‌క్కింది .…

7 hours ago

యోగా దినచర్యలో భాగం కావాలి బిజెపి సీనియర్ నాయకులు కంజర్ల కృష్ణమూర్తి

మనవార్తలు ప్రతినిధి , రామచంద్రపురం : అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని బీహెచ్ఈఎల్ వాకింగ్ టీం ఆధ్వర్యంలో బిహెచ్ఇఎల్ జిల్లా…

12 hours ago

రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమే ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

చిన్న కంజర్లలో బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు షాక్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన 50…

12 hours ago

పాత పద్ధతిలోనే ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలి రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: పాత పద్ధతిలోనే ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలని జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు,రాజ్యసభ…

12 hours ago

పటాన్‌చెరులో అంగరంగ వైభవంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు

హాజరైన వందలాది మంది విద్యార్థులు, వివిధ వర్గాల ప్రజలు, అధికారులు, మాజీ ప్రజా ప్రతినిధులు రెండు గంటల పాటు నిర్విరామంగా…

12 hours ago