_టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మహిళా సాధికారికత
_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మహిళా సాధికారత సాధ్యమైందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని పటాన్చెరు నియోజకవర్గ స్థాయి మహిళా క్రీడా పోటీలను శుక్రవారం ఉదయం పటాన్చెరువు పట్టణంలోని మైత్రి మైదానంలో ఎమ్మెల్యే జిఎంఆర్ క్రీడాజ్యోతి వెలిగించి లాంచనంగా ప్రారంభించారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళల కోసం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కెసిఆర్ కిట్ లాంటి వినూత్న పథకాలతో పాటు అన్ని రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తున్నారని అన్నారు. పారిశ్రామిక రంగంలో మహిళా పారిశ్రామికవేత్తలకు సబ్సిడీపై రుణాలు అందించడంతోపాటు ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం అందిస్తున్నారని అన్నారు. ఎంపీపీగా ఉన్నప్పటినుండి నేటి వరకు మహిళా దినోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలో మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, మహిళ ఉద్యోగినులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: దీర్ఘకాలిక వాపు సంబంధిత వ్యాధుల చికిత్స కోసం పరిశోధనను విజయవంతంగా పూర్తిచేసిన హైదరాబాదు లోని గీతం స్కూల్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఆపత్కాలంలో పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక సంజీవనిలా మారిందని, నిరుపేదల ఆరోగ్య భద్రతకు…
ఎం.ఫార్మ్. కోర్సు 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని…