పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులోని మైత్రీ స్టేడియంలో ఈ నెల 4 నుంచి ఇండస్ట్రియల్ క్రికెట్ టోర్నమెంట్ 2023 ను ప్రారంభించనున్నట్లు ఎండీఆర్ యంగ్ లీడర్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు ఎం. పృథ్వీరాజ్ తెలిపారు.పటాన్చెరులోని ఎండీఆర్ ఫౌండేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్యక్రమాల వివరాలను వెల్లడించారు పటాన్ చెరు ప్రాంతంలోని కంపెనీలలో పనిచేసే ఉద్యోగులకు మానసికోల్లాసం, స్నేహభావం పెంపొందేందుకు ప్రతి ఏటా ఈ టోర్నమెంట్ ను జరపనున్నట్లుతెలిపారు. ఈ టోర్నమెంట్ ను ఈ నెల 12 వ తేదీ వరకు ఉంటుందన్నారు. ఇక్రిషాట్, బీహెచ్ఈఎల్, తోషిబా తదితర కంపెనీల ఉద్యోగులు పాల్గొననున్నట్లు తెలిపారు. మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సహకారంతో మరిన్ని సేవాకార్యక్రమాలు చేపడుతామని ఎండీఆర్ యంగ్ లీడర్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు ఎం. పృథ్వీరాజ్ తెలిపారు.స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ డాక్టర్ అంజనేయ గౌడ్ పాల్గొంటారని అన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…