Telangana

గీతమ్ లో ఘనంగా అంతర్జాతీయ సదస్సు ప్రారంభం…

పాల్గొన్న అంతర్జాతీయ నిపుణులు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని భౌతికశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో “సునీభవించిన పదార్ధ భౌతిక శాస్త్రంలో పురోగతి’ అనే అంశంపై హైబ్రీడ్ పద్ధతిలో నిర్వహిస్తున్న మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు బుధవారం ఘనంగా ప్రారంభమైంది.సదస్సు చైర్ ప్రొఫెసర్ అశోక్ ఛటర్జీ జ్యోతి ప్రజ్వలనతో లాంఛనంగా ఆరంభించి, సదస్సు ప్రొసీడింగ్ లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు, విశ్వవ్యాప్తంగా ఉన్న నిపుణులను ఒకచోట చేర్చి ఏనూత్న ఆలోచనలను మార్పిడి చేసుకోవడానికి, ఆధునిక కండెన్స్డ్ మేటర్ ఫిజిక్స్ లో తాజా పరిణామాలను పంచుకోవడానికి ఈ సదస్సు తోడ్పడుతుందన్నారు. సభాధ్యక్షత వహించిన స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దత్తాత్రి జెయిస్ కె.నగేష్ మాట్లాడుతూ, ఈ రంగంలోని అంతర్ విభాగ స్వభావాన్ని ప్రస్తావించడంతో పాటు యువత దీనిని సద్వినియోగం చేసుకుని, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సు విజయవంతం కావాలని గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ అభిలషించారు.

ఈ సదస్సులో భాగంగా, బెంగళూరులోని ఐఐఎస్సీకి చెందిన ప్రొఫెసర్ విజయ్ బి.షెయోమ్, రష్యా సెయింట్ పీటర్స్ బర్గ్ లోని ఐటీఎంవో విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ ఇగోర్ యు. పొసాన్, టర్కీ ఇజ్మీర్ ఇనిష్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ప్రొఫెసర్ ఆర్.తుగ్రవల్ సెంగర్, ఐఐటీ హైదరాబాద్ కు చెందిన ప్రొఫెసర్ జె.సూర్యనారాయణ కీలకోపన్యాసాలు, ఆహ్వాన ఉపన్యాసాలు చేశారు. దీనికి సమాంతరంగా మౌఖిక, పోస్టర్ ప్రదర్శనలు కూడా నిర్వహించారు. భౌతికశాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ టి.విశ్వం మాట్లాడుతూ, ఆ విభాగంలోని అధ్యాపకులు, రీసెర్చ్ స్కాలర్ల వివరాలతో పాటు ఇప్పటివరకు దాదాపు 150 పరిశోధనా పత్రాలను ప్రచురించినట్టు పేర్కొన్నారు. కన్వీనర్ డాక్టర్ ఐవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, తనకు 170 పరిశోధనా పత్రాలు అందాయని, వాటిలో నుంచి 112 ఎంపిక చేశానున్నారు. ఈ సదస్సులో నాలుగు కీలకోపన్యాసాలు, 12 ఆహ్వానిత ఉపన్యాసాలు, 36 మౌఖిక ప్రదర్శనలతో పాటు 60 పోస్టర్లను ప్రదర్శించనున్నట్టు చెప్పారు. వివిధ విభాగాలకు చెందిన పరిశోధకులు, నిపుణుల మధ్య ఫలవంతమైన చర్చలు, సహకారాలకు వేదికను కల్పిస్తున్న ఈ అంతర్జాతీయ సదస్సు మరో రెండు రోజుల పాటు కొనసాగనున్నది.

admin

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

8 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago