Telangana

ప్రతిచోటా గణాంకాలు: ప్రొఫెసర్ జేఎస్ రావు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

ప్రస్తుత ప్రపంచంలో గణాంకాల ప్రాధాన్యం బాగా పెరిగిపోయిందని, ఏ రంగంలో చూసిన గణాంకాల ఆవశ్యకత తప్పనిసరిగా మారిందని అమెరికాలోని శాంటా బార్బరాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం స్టాటిస్టిక్స్, ఆఫ్లెడ్జ్ ప్రాబబిలిటీ విభాగ విశిష్ట ఆచార్యుడు ప్రొఫెసర్ జే.ఎస్.రావు అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ లోని గణిత శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘గణాంకాలు కొన్ని విహారాలు’ అనే అంశంపై గురువారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు.నేటి సమాజంలో అనువర్తిత గణాంకాలు విస్తృతంగా ఉన్నాయని గణాంక రంగంలో నిపుణుడెన ప్రొఫెసర్ రావు చెప్పారు. ప్రపంచాన్ని మార్చే పరిణామాలను కనుగొని అమలు చేయడానికి గణాంక నిపుణులు తెర వెనుక నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. డేటా మెనింగ్, బిజినెస్ అనలిటిక్స్, యాక్చురియల్, ఫైన్టాన్షియల్ మోడల్స్, వచన-దృశ్య విశ్లేషణ (టెక్స్ట్-ఇమేజ్ అనాలిసిస్) వంటి వివిధ రంగాలకు గణాంకాల వినియోగం విస్తరించినట్టు. ఆయన తెలిపారు.

వాస్తవ ప్రపంచంలో గణాంకాల పాత్ర ఈ నిర్దిష్ట రంగాలకు మించినదని, ఇది విశ్వవ్యాప్తంగా ప్రభుత్వ కార్యకూపాలలో కీలక భూమిక పోషిస్తోందన్నారు. ముఖ్యంగా ప్రజా భద్రత, ఆరోగ్య సంరక్షణ మెరుగుదల, వివిధ విభాగాలలో జ్ఞాన పురోగతికి దోహదం చేస్తుందని చెప్పారు. ఏదైనా ముఖ్యమైన రంగంలో పరిశోధకులకు గణాంక మద్దతు ప్రాముఖ్యతను ప్రొఫెసర్ జేఎస్ రావు నొక్కిచెప్పారు.నేటి డేటా ఆధారిత ప్రపంచంలో, గణాంకాలను అన్వయించడమనేది సమాజంలోని ప్రతి అంశాన్ని స్పృ శించే నిత్య వాస్తవికతగా పేర్కొన్నారు. గణాంకాల రంగం శతాబ్దాలుగా ఉన్నప్పటికీ, ఆధునిక గణాంకవేత్తల వినూత్న పరిష్కార విధానాల కారణంగా ఇటీవలి సంవత్సరాలలో దాని ప్రభావం గణనీయంగా విస్తరించినట్టు డాక్టర్ రావు, చెప్పారు.కాగా, అతిథిని గణిత శాస్త్ర విభాగం ప్రొఫెసర్ బీ.ఎం. నాయుడు స్వాగతించి, ఆయన నైపుణ్యాలను ‘పంచుకునేందుకు గీతం విచ్చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ డి.మల్లికార్జునరెడ్డి వందన సమర్పణతో ఈ కార్యక్రమం ముగిసింది.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago