_ముఖ్య అతిథిగా పాల్గొన్న అరబిందో ఉపాధ్యక్షుడు డాక్టర్ సత్యేంద్రనాథ్
పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ, హెదరాబాద్ మంగళవారం జాతీయ ‘ఉత్తమ తయారీ విధాన’ (జీఎంపీ) దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అరబిందో ఫార్మా అసోసియేట్ వెస్ట్ ప్రెసిడెంట్ (కార్పొరేట్ క్వాలిటీ) డాక్టర్ సీ.వీ. సత్యేంద్రనాథ్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ‘ఉత్తమ డాక్యుమెంటేషన్ ప్రాక్టీస్’ (జీఎంపీ) ప్రాముఖ్యతపై అతిథ్య ఉపన్యాసం ఇచ్చారు. జీఎంపీ నాణ్యత హామీలో అంతర్భాగమైనదని, మంచి తయారీ అలవాట్లతో ముడిపడి ఉందన్నారు. పత్రాల తయారీ, సమీక్షించడం, ఆమోదించడం, జారీచేయడం, రికార్డింగ్, నిల్వ చేయడం వంటి క్రమబద్ధమైన ప్రక్రియలన్నీ ఉత్తమ డాక్యుమెంటేషన్ ప్రాక్టీస్లో భాగంగా ఆయన అభివర్ణించారు.
ఉత్తమ తయారీ పద్ధతుల యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, ఔషధాలను స్థిరంగా ఉత్పత్తి చేయడంతో పాటు వినియోగానికి తగిన నాణ్యతా ప్రమాణాలతో, ఉత్పత్తి మార్గదర్శకాలకు అనుగుణంగా నియంత్రిస్తాయని డాక్టర్ సత్యేంద్రనాథ్ చెప్పారు. ఔషధాల తయారీలో నాణ్యత నిర్వహణ, సిబ్బంది అర్హత, పరిశుభ్రత, డాక్యుమెంటేషన్, రికార్డులు, పదార్థాల నిర్వహణ, ఉత్పత్తి, ప్యాకేజింగ్ వంటి అంశాల ప్రాధాన్యాన్ని కూడా ఆయన వివరించారు.గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీ.ఎస్.కుమార్ అతిథిని స్వాగతించి సత్కరించగా, కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ హెన్డు పొన్నగంటి వందన సమర్పణ చేశారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…