politics

త్వరలో తెలంగాణలో ఇన్లాండ్ పోర్ట్ !

పటాన్ చెరు:

దుబాయ్ కు చెందిన బహుళజాతి లాజిస్టిక్స్ కంపెనీ డీపీ వరల్డు విశ్వవ్యాప్తంగా 60 పెద్ద ఓడరేవులు ఉన్నాయని , హైదరాబాద్ చుట్టుపక్కల సరకు రవాణా కోసం టెర్నినల్ను ( ఇన్లాండ్ పోర్ట్ ) నిర్మించాలనే యోచనలో ఉందని , త్వరలో అది సాకారం కావొచ్చని తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సమాఖ్య అధ్యక్షుడు కె.భాస్కరరెడ్డి చెప్పారు . గీతం హైదరాబాద్ బిజినెస్ స్కూల్ ( జీహెచ్బీఎస్ ) లోని ఆపరేషన్స్ అండ్ సప్లయ్ చెనై ఆధ్వర్యంలో ‘ లాజిస్టిక్స్ రంగం , అందులో పెరుగుతున్న కెరీర్ అవకాశాలు ‘ అనే అంశంపై నిర్వహిస్తున్న ఒకరోజు అంతర్జాతీయ చర్చాగోష్ఠిని గురువారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు .

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ , లాజిస్టిక్స్ రంగంలో అపూర్వమైన వృద్ధి నమోదవుతోందని , మనదేశంలో అధిక సంఖ్యలో ఉద్యోగాలు కల్పించే రంగాలలో ఒకటిగా ఇది నిలిచిందని చెప్పారు . ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన గతిశక్తి పథకం ఈ రంగానికి పెద్ద వరమన్నారు . విద్యార్థులు సొంతంగా పరిశోధనలు చేపట్టడంతో పాటు ఇంటర్నేస్లు చేస్తే ఈ రంగంపై మంచి అవగాహన ఏర్పడుతుందని ఆయన సూచించారు .

ఎంతో ఆశావహంగా ఉన్న ఈ రంగానికి కృత్రి మేథ , రోబోటిక్స్ వంటి అత్యాధునిక పరిజ్ఞానం తోడెతే మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయని భాస్కరరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు . 1981 నుంచి లాజిస్టిక్స్ రంగం ఎదుగుదల , సాధిస్తున్న ప్రగతిని గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ గుర్తుచేశారు . మనదేశ జాతీయ స్థూల ఉత్పత్తిలో లాజిస్టిక్స్ రంగానికి 12 శాతం వాటా ఉందని , 18 శాతం వృద్ధిని ఆ రంగం నమోదు చేస్తున్నట్టు జీహెచ్బీఎస్ డెరైక్టర్ ప్రొఫెసర్ బి.కరుణాకర్ చెప్పారు .

లాజిస్టిక్స్ రంగంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యకలాపాల గురించి చెన్నయ్ లోని లాజిస్టిక్స్ నెఫుణ్య మండలి ( ఎన్ఎస్సీ ) సీఈవో కెప్టెన్ రామానుజన్ , స్నాతకోత్సవ స్థాయిలో లాజిస్టిక్స్న ఒక పాఠ్యాంశంగా ప్రోత్సహించడంలో ఎల్ఎస్సీ పాత్ర గురించి ఆ సంస్థ అధిపతి ప్రొఫెసర్ ఎస్.గణేషన్ వివరించగా , డెల్లాయిట్కు చెందిన టెక్నాలజీ కన్సల్టింగ్ డెరైక్టర్ సందీప్ చటర్జీ , జీఎంఆర్ ఎయిర్ కార్గో సీఈవో సౌరబ్ కుమార్ , ఐఎన్ఎస్ దక్షిణాసియా డెరైక్టర్ విపిన్ శంకర్ , బెల్జియంలోని పోర్ట్ ప్రాజెక్ట్స్ మేనేజర్ కొయిన్ కొర్నెల్లీ , ఐఎస్బీ సీనియర్ డీన్ ప్రొఫెసర్ చందన్ చౌధురి , షార్జాలోని స్కెలైన్ యూనివర్సిటీ డీన్ వె.రామకృష్ణ తదితరులు ముఖ్య వక్తలుగా పాల్గొన్నారు . తొలుత ప్రొఫెసర్ దేబాషిశ్ ముఖర్జీ అతిథులను స్వాగతించగా , కార్యక్రమ నిర్వాహకుడు ఫకృద్దీన్ షేక్ వందన సమర్పణ చేశారు .

Ramesh

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

8 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

8 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

8 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

3 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

3 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

3 days ago