ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐఈకణ తెలంగాణ విభాగం అధ్యక్షుడు బ్రహ్మారెడ్డి ఆత్మీయ అతిథులుగా విచ్చేసిన ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ డెరైక్టర్ రామేశ్వరరావు, ఐఎస్ఎన్ రాజ
పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్లో ‘ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ (ఇండియా) విద్యార్థి విభాగాన్ని” గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఐతల తెలంగాణ విభాగం అధ్యక్షుడు బి. బ్రహ్మారెడ్డి ముఖ్య అతిథిగా, ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, హెదరాబాద్ (ఎసీసీఐ) డైరెక్టర్ డాక్టర్ జి.రామేశ్వరరావు, ఐత్వల పరిశోధన-అభివృద్ధి విభాగం జాతీయ అధ్యక్షుడు ఐ.సత్యనారాయణ రాజు ఆత్మీయ అతిథులుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అతల విద్యార్థి విభాగం సభ్యత్వం ప్రాముఖ్యత, ఒనగూరే ప్రయోజనాలు గురించి బ్రహ్మారెడ్డి వివరించారు.. ఐఈఐనీ 1920లో స్థాపించారని, మనదేశంలో 15 ఇంజనీరింగ్ విభాగాలలో ఎనిమిది లక్షల నుంది సభ్యులతో 25 కేంద్రాలు ఉన్నాయని, 2,100 విద్యార్థి విభాగాలు దీనికి అదనమని ఆయన చెప్పారు. ఐఈఐ విద్యార్థి విభాగంలో సభ్యత్వం ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలను డాక్టర్ రామేశ్వరరావు వివరించడంతో పాటు ఈఎసీసీఐ కార్యకాలను, ఇప్పటివరకు పొందిన ప్రతిష్ఠాత్మక అవార్డుల గురించిన ఓ వీడియోను ఆయన ప్రదర్శించారు. 3రిశోధనలను చేపట్టే విద్యార్థులను ఐఈల ప్రోత్సహిస్తుందని, తగిన నిధులను కూడా నుంజూరు చేస్తుందని. డాక్టర్ సత్యనారాయణ రాజు భరోసా ఇచ్చారు.
ఐఈఐతో తనకున్న 25 ఏళ్ల అనుబంధాన్ని, విద్యార్ధిగా ఉన్నప్పుడు ఉత్తమ పత్ర సమర్పణకు గాను పొందిన బంగారు పతకం వివరాలను ఈ సందర్భంగా గీతం కోర్ ఇంజనీరింగ్ డీన్ ప్రొఫెసర్ వీఆర్ శాస్త్రి గుర్తుచేసుకున్నారు. మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ పి.శ్రీనివాస్ అతిథులను స్వాగతించగా, ప్రొఫెసర్ ఈశ్వర్ వందన సమర్పణతో మొగిసిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురు బి.టెక్. అధ్యాపకులు, విద్యార్థులు కూడా పాల్గొన్నారు.
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…