Telangana

ముదిరాజ్ చైతన్య వేదిక ఆధ్వర్యంలో లక్ష పోస్ట్ కార్డుల ఉద్యమం

మన వార్తలు, శేరిలింగంపల్లి :

ముదిరాజ్ చైతన్య వేదిక ఆధ్వర్యంలో మంగళవారం రోజు హైదరాబాదులో గన్ పార్క్ దగ్గర జరిగిన కార్యక్రమంలో, తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజులకు జరుగుతున్న అన్యాయాలపై ముదిరాజ్ చైతన్య వేదిక “లక్ష పోస్ట్ కార్డుల” ఉద్యమానికి తెర లేపింది. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ రాష్ట్ర నాయకులు శివ ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణలో అతి త్వరలో జరుగబోయే ఎన్నికల్లో, తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు 15 ఎమ్మెల్యే టిక్కెట్లను, ఎమ్మెల్సీ, ఎంపీ స్థానాలతో పాటు నామ టికెట్ పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముదిరాజు ల రిజర్వేషన్ సమస్యలను పరిష్కరించాలని, అందుకోసమే ఈ లక్ష పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణ లో ఉన్న అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకు రాసి ముదిరాజ్ ల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసే దిశగా ఈ ఉద్యమం సాగుతుందని, ముదిరాజ్ మహిళ రాష్ట్ర నాయకురాలు కోట్ల పుష్పలత ముదిరాజ్ పేర్కొన్నారు. ఈ ఉద్యమంలో రాజకీయ పార్టీలకు, సంఘాలకు, ప్రాంతాలకు అతీతంగా పాల్గొని ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్రంలో ఉన్న ముదిరాజు లకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రమేష్, కురుమూర్తి, నర్సింహా, సీతా మహాలక్ష్మి, సురేష్, వేంకటేశ,మహేష్, రాకేష్, జగదీష్ , కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

59 minutes ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

1 hour ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

1 hour ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago