Telangana

ముదిరాజ్ చైతన్య వేదిక ఆధ్వర్యంలో లక్ష పోస్ట్ కార్డుల ఉద్యమం

మన వార్తలు, శేరిలింగంపల్లి :

ముదిరాజ్ చైతన్య వేదిక ఆధ్వర్యంలో మంగళవారం రోజు హైదరాబాదులో గన్ పార్క్ దగ్గర జరిగిన కార్యక్రమంలో, తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజులకు జరుగుతున్న అన్యాయాలపై ముదిరాజ్ చైతన్య వేదిక “లక్ష పోస్ట్ కార్డుల” ఉద్యమానికి తెర లేపింది. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ రాష్ట్ర నాయకులు శివ ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణలో అతి త్వరలో జరుగబోయే ఎన్నికల్లో, తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు 15 ఎమ్మెల్యే టిక్కెట్లను, ఎమ్మెల్సీ, ఎంపీ స్థానాలతో పాటు నామ టికెట్ పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముదిరాజు ల రిజర్వేషన్ సమస్యలను పరిష్కరించాలని, అందుకోసమే ఈ లక్ష పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణ లో ఉన్న అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకు రాసి ముదిరాజ్ ల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసే దిశగా ఈ ఉద్యమం సాగుతుందని, ముదిరాజ్ మహిళ రాష్ట్ర నాయకురాలు కోట్ల పుష్పలత ముదిరాజ్ పేర్కొన్నారు. ఈ ఉద్యమంలో రాజకీయ పార్టీలకు, సంఘాలకు, ప్రాంతాలకు అతీతంగా పాల్గొని ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్రంలో ఉన్న ముదిరాజు లకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రమేష్, కురుమూర్తి, నర్సింహా, సీతా మహాలక్ష్మి, సురేష్, వేంకటేశ,మహేష్, రాకేష్, జగదీష్ , కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

7 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago