Telangana

పటాన్చెరులో ఆక్రమ వెంచర్లతో ప్రజలను మోసం చేస్తున్నారు-భాధితులు

 _తప్పుడు వెంచర్ వేసుకుని ఇతర వ్యక్తులకు ప్లాట్లను అమ్మి వేస్తున్నారు -బాధితులు

_మా ఫ్లాట్లను మాకు వచ్చే విధంగా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తుసుకుని మాకు న్యాయం చేయాలి 

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :

తమ ప్లాట్లలో బయటి వ్యక్తులు వచ్చి అక్రమ వెంచర్లు వేసి, ప్లాట్లను ఇతర వ్యక్తులకు అమ్మి మాకు అన్యాయం చేస్తున్నారని భాధితులు సాంబశివరావు, కిరణ్ రాజు, భాస్కర్ రావు, సురేష్, నారాయణరావు సుబ్బారావు లు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం పటాన్‌చెరు మండలం రామేశ్వరం బండ లోని వారి ప్లాట్ల వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోదావరిఖని, మంచిర్యాల, శ్రీరాంపూర్, కొత్తగూడెం, మణుగూరు, కొలబెల్ట్ ప్రాంతంలోని సింగరేణిలో ఉద్యోగం నిర్వహిస్తున్న సమయంలో 1985 లో మేమందరం సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరు మండలం రామేశ్వర బండ గ్రామంలోని సర్వేనెంబర్ 183,184, 221 లోని దాదాపుగా 100 ప్లాట్లకు పైన (ఒక్కొక్క ప్లాటు 350 చదరపు గజాలు) సంగారెడ్డి జిల్లా మెజిస్ట్రేట్ న్యాయ స్థానం ఆధ్వర్యంలో వేలంలో కొన్నటువంటి వ్యక్తులు, లేఔట్ వేసి అమ్మిన ప్లాట్లను కొనుగోలు చేశామని అన్నారు. వాళ్ళు మాకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారని తెలిపారు. ఈ విషయం అంత రామేశ్వరం బండ గ్రామపంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ కు పూర్తిస్థాయిలో తెలుసని అన్నారు.

మాకు ఇల్లు నిర్మించుకోవడానికి గ్రామపంచాయతీ ద్వారా పర్మిషన్ కూడా ఇచ్చారని చెప్పారు. మా అందరికీ తెలియకుండా రామరాజు అనే వ్యక్తి తప్పుడు వెంచర్ వేసుకుని ఇతర వ్యక్తులకు ప్లాట్లను అమ్మి వేయడం జరిగినదని అన్నారు. దీనిపై అనేకసార్లు పోలీస్ స్టేషన్లో సైతం కేసు పెట్టేందుకై దరఖాస్తులు సైతం ఇవ్వడం జరిగిందన్నారు. అదే వ్యక్తి మా ఫ్లాట్లలో ప్రవేశించి ప్రహరిగొడ నిర్మిస్తున్నారని, అంతే గాక మా ఫ్లాట్ లను చిందర వందర చేసి, ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నాడని తెలిపారు. ఇది తెలిసి మేము అక్కడకు వెళ్ళగా మమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేయడమే గాక మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోపోండి, మీరేం చేయలేరు అని మమ్ములను బెదిరించే ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయమైన మా ఫ్లాట్లను మాకు వచ్చే విధంగా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని మాకు న్యాయం చేయాలని వారు కోరారు. మా యొక్క ప్లాట్ లలో చేరబడి, మాకు బెదిరించి ప్రయత్నం చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బాధిత సభ్యులు పాల్గొన్నారు.

admin

Recent Posts

మరోసారి భక్తి భావం చాటిన ఎండీఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ శ్రీ మాద్రి పృథ్వీరాజ్

దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత_ ఎండీఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ శ్రీ మాద్రి పృథ్వీరాజ్ శాస్త్రోక్తంగా మొదలైన శ్రీ ఎల్లమ్మ పోచమ్మ…

3 hours ago

లక్ష్మీ డాక్యుమెంటరీ రైటర్స్ అధినేత సాయిరాం గుప్తా ఆధ్వర్యంలో చలివేంద్రం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : పటాన్ చెరు పట్టణం ఎమ్మార్వో కార్యాలయం ఎదురుగా సాయి లక్ష్మీ డాక్యుమెంటరీ రైటర్స్…

3 hours ago

భవిష్యత్తుకు తగ్గ అధ్యాపకులను తీర్చిదిద్దుతాం

గీతం స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభోత్సవంలో డాక్టర్ రిచా శర్మ మనవార్తలు ప్రతినిధి ,…

2 days ago

*రియల్ హీరో సోనుసూద్ చేతుల మీదుగా ఘనంగా అశ్య ఫుడ్స్ ప్రోడక్ట్ లాంచ్

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్:  ఆహారం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అది ఎప్పుడూ డిమాండ్ బిజినెస్. అందుకే ఆహారంలో…

2 days ago

కాంగ్రెస్ కక్ష రాజకీయాలకు హైకోర్టు చెక్

“కాళేశ్వరం నిజం బయటపడింది  బీఆర్ఎస్ ఆరోపణలకు న్యాయబలం” “రైతులను మోసం చేసింది ఎవరు _ ప్రభుత్వం సమాధానం చెప్పాలి ప్రజల…

3 days ago

మహిళల భద్రత సామాజిక బాధ్యత

పరిశోధనాంశాలను వివరించిన సైకాలజీ అధ్యాపకురాలు డాక్టర్ అఫ్రిన్ వసీం మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మహిళలు భయం లేకుండా…

3 days ago