_పిల్లలను కార్యోన్ముఖులుగా తీర్చిదిద్దాలి – డిసిపి శిల్పవ ళ్లి
మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి :
మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకు చక్కటి చదువుతోపాటు చక్కటి గుణగణాలను నేర్పుతూ అన్ని రంగాల్లో రాణించే విధంగా తీర్చిదిద్దాలని మాదాపూర్ డిసిపి శిల్పవల్లి అన్నారు. బిహెచ్ఇఎల్ టౌన్ షిప్ లోని జ్యోతి విద్యాలయ హై స్కూల్ లో నిర్వహించిన స్టూడెంట్ ఫెస్ట్ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లలు చేసిన సాంస్కృతి కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయని కొనియాడారు. పిల్లలను కేవలం చదువుకే పరిమితం కాకుండా వివిధ రంగాల్లో రాణించేలా ప్రోత్సహించాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఫ్యాషన్, ట్రెండ్ అనే ధోరణిలో పడి పెడదోవ పెట్టె అవకాశం ఉంది కాబట్ట తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
వివేకంతో కూడిన విద్యను అందించాలని కోరారు. పిల్లలను అతిగారాభంగా కాకుండా వారిని స్వసక్తితో ఎదిగే విధంగా సమాజంలో ఒక గొప్ప వ్యక్తులుగా తయారయ్యేలా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అటు తల్లిదండ్రులు ఇటు ఉపాధ్యాయులపై ఉందన్నారు. సమాజం పై అవగాహన లేకపోవడం వారిపై వారికి నమ్మకం లేకపోవడం వంటి లక్షణాలతో నేడు అనేక విధాలుగా సమాజంలో చెడిపోయిన వ్యక్తులుగా మారుతున్నారని పేర్కొన్నారు. చిన్నప్పటినుండి వారి పనులు వారు చేసుకుంటూ , ఇతరులకు సాయం చేసే విధంగా సమాజంలో గొప్ప వ్యక్తులుగా మారెందుకు మన వంతు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేజర్ జయసుధ, హై కోర్ట్ అద్వకేట్ తులసి రాజ్ గోకుల్, రెఫరెండ్ ఫాదర్ సంతురాజ్, స్కూల్ కరస్పాండెంట్ ఆంబ్రోస్ బెక్, ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి, జగధీష్, లతాచౌదరి, జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిని వెంటనే సస్పెండ్ చేయాలి ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు అర్జున్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:…
సిఐటియు ఆధ్వర్యంలో ఆసుపత్రి సూపర్ డెంట్ కు వినతి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు మనవార్తలు ప్రతినిధి ,…
ఎస్ టిపి ప్లాంటు ఏర్పాటును విరమించుకోవాలి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా, కలెక్టర్ కు వినతి మనవార్తలు ప్రతినిధి…
ఆనందంగా పాల్గొన్న గీతం ఉన్నతాధికారులు, సిబ్బంది, విద్యార్థులు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఆరోగ్యం, శ్రేయస్సుకు యోగాను ఒక సంపూర్ణ…
మనవార్తలు ప్రతినిధి , రామచంద్రపురం : యోగాతో శరీరం, మనస్సు, ఆత్మకు సమతుల్యత లభిస్తుందని భారతీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: సామాజిక సేవ కార్యక్రమాల నిర్వహిస్తున్న ఎండీఆర్ ఫౌండేషన్ ఖాతాలో మరో అవార్డు దక్కింది .…