_బి ఆర్ ఎస్ నేతలు ధరణి పేరుతో రైతులను దోచుకుంటున్నారు
పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
ధరణి పోర్టల్ ద్వారా పేద రైతులు నష్టపోతున్నారని బీజేపీ నేత గడిల శ్రీకాంత్ గౌడ్ అన్నారు. పటాన్ చేరు నియోజకవర్గంలోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గడిల శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ.ధరణి పోర్టల్ ద్వారా రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని … రెవెన్యూ అధికారుల అండదండలతో ముఖ్యమంత్రి కేసిఆర్ నుండి మొదలుకొని బారస మంత్రులు, ఎమ్మెల్యేలు, గ్రామ స్థాయి నాయకుల వరకు అడ్డు అదుపు లేకుండా దోచుకుంటున్నారని ఆరోపించాడు.ధరణి పోర్టల్ లో ఉన్న రైతుల భూములకు సమస్యలను సృష్టించి వారే పరిష్కరిస్తున్నారని అయిన అన్నారు.సమస్యను పరిష్కరించడానికి పేద రైతులను అమయాకపు భూ యజమానులను భయబ్రాంతులకు గురిచేసి వారి భూములను అక్రమంగా ఆక్రమించి వేల కోట్ల రూపాయలు దండుకుంటున్నారని ఆయన మండిపడ్డారు.ప్రభుత్వం వెంటనే వారి సమస్యల్ని పరిష్కరించాలని లేని పక్షంలో కలెక్టర్ కార్యాలయాలు , మండల కార్యాలయాలు ,ఎమ్మెల్యే కార్యాలయాలను ముట్టడిస్తామన్నారు. ధరణి సమస్యల పరిస్కారం కోసం భారతీయ జనతాపార్టీ తరపున పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. .
ఈ కార్యక్రమంలో బిజెపి ఓబిసి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దేవేందర్ గౌడ్, జిల్లా కార్యదర్శి బైండ్ల కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యుడు మధుకర్ రెడ్డి, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు జోగు ధన్ రాజ్, మరియు ఎస్.ఆర్.కే యువసేన సభ్యులు శకిల్, రాజ్ గోపాల్, దుర్గా సాయి, ఆదిత్య,నవిన్ తదితరులు పాల్గొన్నారు
దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత_ ఎండీఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ శ్రీ మాద్రి పృథ్వీరాజ్ శాస్త్రోక్తంగా మొదలైన శ్రీ ఎల్లమ్మ పోచమ్మ…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : పటాన్ చెరు పట్టణం ఎమ్మార్వో కార్యాలయం ఎదురుగా సాయి లక్ష్మీ డాక్యుమెంటరీ రైటర్స్…
గీతం స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభోత్సవంలో డాక్టర్ రిచా శర్మ మనవార్తలు ప్రతినిధి ,…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: ఆహారం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అది ఎప్పుడూ డిమాండ్ బిజినెస్. అందుకే ఆహారంలో…
“కాళేశ్వరం నిజం బయటపడింది బీఆర్ఎస్ ఆరోపణలకు న్యాయబలం” “రైతులను మోసం చేసింది ఎవరు _ ప్రభుత్వం సమాధానం చెప్పాలి ప్రజల…
పరిశోధనాంశాలను వివరించిన సైకాలజీ అధ్యాపకురాలు డాక్టర్ అఫ్రిన్ వసీం మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మహిళలు భయం లేకుండా…