Telangana

పటాన్చెరులో ఆక్రమ వెంచర్లతో ప్రజలను మోసం చేస్తున్నారు-భాధితులు

 _తప్పుడు వెంచర్ వేసుకుని ఇతర వ్యక్తులకు ప్లాట్లను అమ్మి వేస్తున్నారు -బాధితులు

_మా ఫ్లాట్లను మాకు వచ్చే విధంగా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తుసుకుని మాకు న్యాయం చేయాలి 

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :

తమ ప్లాట్లలో బయటి వ్యక్తులు వచ్చి అక్రమ వెంచర్లు వేసి, ప్లాట్లను ఇతర వ్యక్తులకు అమ్మి మాకు అన్యాయం చేస్తున్నారని భాధితులు సాంబశివరావు, కిరణ్ రాజు, భాస్కర్ రావు, సురేష్, నారాయణరావు సుబ్బారావు లు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం పటాన్‌చెరు మండలం రామేశ్వరం బండ లోని వారి ప్లాట్ల వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోదావరిఖని, మంచిర్యాల, శ్రీరాంపూర్, కొత్తగూడెం, మణుగూరు, కొలబెల్ట్ ప్రాంతంలోని సింగరేణిలో ఉద్యోగం నిర్వహిస్తున్న సమయంలో 1985 లో మేమందరం సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరు మండలం రామేశ్వర బండ గ్రామంలోని సర్వేనెంబర్ 183,184, 221 లోని దాదాపుగా 100 ప్లాట్లకు పైన (ఒక్కొక్క ప్లాటు 350 చదరపు గజాలు) సంగారెడ్డి జిల్లా మెజిస్ట్రేట్ న్యాయ స్థానం ఆధ్వర్యంలో వేలంలో కొన్నటువంటి వ్యక్తులు, లేఔట్ వేసి అమ్మిన ప్లాట్లను కొనుగోలు చేశామని అన్నారు. వాళ్ళు మాకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారని తెలిపారు. ఈ విషయం అంత రామేశ్వరం బండ గ్రామపంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ కు పూర్తిస్థాయిలో తెలుసని అన్నారు.

మాకు ఇల్లు నిర్మించుకోవడానికి గ్రామపంచాయతీ ద్వారా పర్మిషన్ కూడా ఇచ్చారని చెప్పారు. మా అందరికీ తెలియకుండా రామరాజు అనే వ్యక్తి తప్పుడు వెంచర్ వేసుకుని ఇతర వ్యక్తులకు ప్లాట్లను అమ్మి వేయడం జరిగినదని అన్నారు. దీనిపై అనేకసార్లు పోలీస్ స్టేషన్లో సైతం కేసు పెట్టేందుకై దరఖాస్తులు సైతం ఇవ్వడం జరిగిందన్నారు. అదే వ్యక్తి మా ఫ్లాట్లలో ప్రవేశించి ప్రహరిగొడ నిర్మిస్తున్నారని, అంతే గాక మా ఫ్లాట్ లను చిందర వందర చేసి, ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నాడని తెలిపారు. ఇది తెలిసి మేము అక్కడకు వెళ్ళగా మమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేయడమే గాక మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోపోండి, మీరేం చేయలేరు అని మమ్ములను బెదిరించే ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయమైన మా ఫ్లాట్లను మాకు వచ్చే విధంగా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని మాకు న్యాయం చేయాలని వారు కోరారు. మా యొక్క ప్లాట్ లలో చేరబడి, మాకు బెదిరించి ప్రయత్నం చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బాధిత సభ్యులు పాల్గొన్నారు.

admin

Recent Posts

వ్యర్థాల నిర్వహణకు ఐటీసీ అవార్డు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: వ్యర్థాల నుంచి సంపద (శ్రేయస్సు)ను సృష్టిస్తున్న హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయాన్ని బుధవారం ఐఐటీ…

22 hours ago

అంతర్జాతీయ సదస్సులో గీతం వాణి

ప్రతిష్టాత్మక సదస్సులో కీలకోపన్యాసం చేసిన సీఎస్ఈ అధ్యాపకురాలు ప్రొఫెసర్ ప్రీతి పర్వేకర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం డీమ్డ్…

22 hours ago

ఆలయాల నిర్మాణానికి సంపూర్ణ సహకారం _ నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలో నూతన దేవాలయాల నిర్మాణం, పురాతన దేవాలయాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం…

2 days ago

ఎంబెడెడ్ సిస్టమ్స్ డిజైన్, ఆటోమేషన్ పై శిక్షణ

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని ఈఈసీఈ విభాగం ఆధ్వర్యంలో జనవరి 19 నుంచి 23 వరకు…

2 days ago

ప్రకృతి ప్రేరణతో అద్భుత డిజైన్లు

ఆతిథ్య ఉపన్యాసంలో పేర్కొన్న ఐఐటీ హైదరాబాదు అధ్యాపకుడు డాక్టర్ ప్రభాత్ కుమార్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రకృతి, భౌతికశాస్త్రం…

2 days ago

ఐనోల్ మల్లన్న స్వామి జాతర లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: పటాన్‌చెరు నియోజకవర్గం, ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని ఐనోలు గ్రామంలో సోమవారం శ్రీశ్రీశ్రీ మల్లికార్జున స్వామి…

3 days ago