Telangana

చిట్కూలులో అంగరంగా వైభవంగా బోనాల సందడి

మనవార్తలు ,పటాన్ చెరు;

చిట్కూలు గ్రామంలో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆ గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. నాలుగురోజుపాటు జరిగే ఈ వేడుకల్లో అమ్మవారికి ఓడిబియ్యం, తొట్టెల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. బోనాల అనంతరం భవిష్యత్‌లో జరుగబోయే అంశాలను అమ్మవారి భవిష్యవాణి వినిపించనున్నట్లు తెలిపారు. ఆరోజు సాయంత్రం పలహార బండి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లుఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి బండిని లాగేందుకు పోటేళ్లను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈసందర్భంగా అమ్మవారికి సర్పంచ్‌ మధు దంపతులు ప్రత్యేక పూజలు చేసి, పలహార బండి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యుత్ కాంతులు, యువతీయువకుల నృత్యాలు, డప్పుచప్పుళ్లతో అత్యంత వైభవంగా పలహార బండి ఊరేగింపు సాగింది. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో ఆ ప్రాంతం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.

రాష్ట్రాన్ని చల్లగా చూడు తల్లి

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తెచ్చాక రాష్ట్ర ప్రజలు మన పండుగలను ఆహ్లాదకరంగా జరుపుకుంటున్నారని తెరాస రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ తెలిపారు. పండుగలకు కూడా అధికారిక గుర్తింపు ఇచ్చి రాష్ట్ర ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు విలువనిచ్చిన ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఒక్కరే ఉన్నారని తెలిపారు. ప్రజలను కన్నబిడ్డలుగా చూసుకునే ముఖ్యమంత్రి కేసీఆర్ ను మూడోసారి కూడా సీఎంను చేయాలని ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ విష్ణు వర్ధన్ రెడ్డి, చెర్మెన్ నారాయణ రెడ్డి, వార్డు సభ్యులు దుర్గయ్య, వెంకటేశ్, కృష్ణ, వెంకటేశ్,బుజాంగం,శ్రీను,మురళీ,వెంకటేశ్, రాజ్ కుమార్, నర్సింగ్, ఆంజనేయులు, రైతు సంఘం అధ్యక్షులు నారాయణ రెడ్డి, చాకలి వెంకటేశ్, నారబోయిన శ్రీనివాస్, పంబల గణేష్,శ్రీకాంత్,రజినీకాంత్ గ్రామ ప్రజలు, యువజన సంఘం నాయకులు,  ఎన్ఎమ్అర్  యువసేన పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago