Telangana

కాలుష్య పీడిత గ్రామాల పోరాట ఫలితమే 200 పడకల ఆసుపత్రి : గడీల శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు ,పటాన్ చెరు;

పటాన్ చెరువులో 200 పడకల ఆసుపత్రి మంజురు కావడం కాలుష్య పీడిత గ్రామాల ప్రజల పోరాట ఫలితమని పటాన్ చెరువు మాజీ జెడ్పీటీసీ, ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా పోరాటంలో భాగస్వాములు అయినటువంటి డాక్టర్ కిషన్ రావు ను నందిగామలోని తన నివాసంలో కలిసి సత్కరించారు.అనంతరం శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ పటాన్ చెరువులో ఆసుపత్రి రావడానికి ముఖ్య కారణం 20 గ్రామాల ప్రజలు, వాళ్ళు కాలుష్యానికి వ్యతిరేకంగా కొన్ని సంవత్సరాల పాటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి, పారిశ్రామలకి, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసినటువంటి పోరాట ఫలితమే ఈ యొక్క 200 పడకల ఆసుపత్రి అని తెలిపారు.

ఆ నిధులను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ఏదైతే బాధితుల కోసం ఒక ఆసుపత్రి ఏర్పాటు చేయాలి దాని నిర్వహణ చేయాలి దాంట్లో కచ్చితంగా డీటాక్సిఫికేషన్ సెంటర్ అంటే పొల్యూషన్ వల్ల ఏర్పడ్డటువంటి టాక్సిన్స్ తోటి ఏవైతే జనాలు అనారోగ్యం పాలై ఇబ్బంది పడుతున్నారు, పొల్యూషన్ కారణంగా వస్తున్నటువంటి అనేకమైనటువంటి రోగాలను, జబ్బులను చికిత్స చేయడానికి తీర్పు ఆదేశాల మేరకు ఏర్పాటు చేస్తున్నటువంటి ఆసుపత్రి అని తెలియజేశారు.జడ్జిమెంట్ వచ్చి దాదాపు 5 సంవత్సరాలు అవుతున్న టిఆర్ఎస్ ప్రభుత్వం అనేక రకాలుగా అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఈ 20 గ్రామాల ప్రజల పోరాటం వల్ల అదేవిధంగా కంటెంట్ ఆఫ్ కోర్టు ఎక్కడ ఫైల్ చేస్తారు అన్న భయంతోటి ప్రభుత్వం ఈ యొక్క జీవో ఆగమేఘాల మీద మంజురు చేసి శంకుస్థాపన  చేశారని అన్నారు .

ఇప్పుడున్న ఎమ్మెల్యే గానీ శంకుస్థాపనకు వచ్చినటువంటి మంత్రులు గాని మేము చేస్తున్నాము, మా ప్రభుత్వం చేస్తుంది అని ఏవైతే గొప్పలు చెప్పుకుంటున్నారు అదంతా అబద్ధమని ఇది రావడానికి కారణం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు పెట్టినా వాళ్ళని శ్రీకాంత్ గౌడ్ గుర్తు చేశారు.అదేవిధంగా ఈ కడుతున్నటువంటి ఆసుపత్రి ప్రాంగణంలో ఇంత పెద్ద ఆసుపత్రికి ఆ ప్రాంతం సరిపోదు ,పటాన్ చెరువు పరిసర ప్రాంతాలలో 25 ఎకరాల సువిశాలమైన ప్రదేశంలో దీన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ పోరాటంలో భాగస్వాములు అయినటువంటి  డాక్టర్ కిషన్ రావు ని ఆరుట్ల వెంకట్ రెడ్డి గారు, లగ్డారం గ్రామ నర్సింహరెడ్డి గారు, చిదురుప్పా గ్రామానికి చెందినటువంటి ముత్యాలు గారు ఇంకా అనేకమంది రైతులకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కృతజ్ఞతలు తెలిపాల్సిన అవసరం ఉందని, వారి పోరాట ఫలితమే ఈ యొక్క ఆసుపత్రి, నష్టపరిహారం ఇంకా తీర్పులో ఉన్నటువంటి వాటిపైన భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అవియ్యకుండా తాత్సారం చేసి వాళ్ళకి అన్యాయం చేస్తుందో దీనిపైన న్యాయపరంగా అదే రకంగా కచ్చితంగా ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉండి ఆ తీర్పులో ఉన్నటువంటి అన్ని ఫలాలు అర్హులైన వారికి చేరే వరకు క్రృషి చేస్తామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో దేవెందర్ గౌడ్, బీజేపీ మండల అధ్యక్షులు ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

7 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

7 hours ago