Telangana

కాలుష్య పీడిత గ్రామాల పోరాట ఫలితమే 200 పడకల ఆసుపత్రి : గడీల శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు ,పటాన్ చెరు;

పటాన్ చెరువులో 200 పడకల ఆసుపత్రి మంజురు కావడం కాలుష్య పీడిత గ్రామాల ప్రజల పోరాట ఫలితమని పటాన్ చెరువు మాజీ జెడ్పీటీసీ, ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా పోరాటంలో భాగస్వాములు అయినటువంటి డాక్టర్ కిషన్ రావు ను నందిగామలోని తన నివాసంలో కలిసి సత్కరించారు.అనంతరం శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ పటాన్ చెరువులో ఆసుపత్రి రావడానికి ముఖ్య కారణం 20 గ్రామాల ప్రజలు, వాళ్ళు కాలుష్యానికి వ్యతిరేకంగా కొన్ని సంవత్సరాల పాటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి, పారిశ్రామలకి, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసినటువంటి పోరాట ఫలితమే ఈ యొక్క 200 పడకల ఆసుపత్రి అని తెలిపారు.

ఆ నిధులను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ఏదైతే బాధితుల కోసం ఒక ఆసుపత్రి ఏర్పాటు చేయాలి దాని నిర్వహణ చేయాలి దాంట్లో కచ్చితంగా డీటాక్సిఫికేషన్ సెంటర్ అంటే పొల్యూషన్ వల్ల ఏర్పడ్డటువంటి టాక్సిన్స్ తోటి ఏవైతే జనాలు అనారోగ్యం పాలై ఇబ్బంది పడుతున్నారు, పొల్యూషన్ కారణంగా వస్తున్నటువంటి అనేకమైనటువంటి రోగాలను, జబ్బులను చికిత్స చేయడానికి తీర్పు ఆదేశాల మేరకు ఏర్పాటు చేస్తున్నటువంటి ఆసుపత్రి అని తెలియజేశారు.జడ్జిమెంట్ వచ్చి దాదాపు 5 సంవత్సరాలు అవుతున్న టిఆర్ఎస్ ప్రభుత్వం అనేక రకాలుగా అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఈ 20 గ్రామాల ప్రజల పోరాటం వల్ల అదేవిధంగా కంటెంట్ ఆఫ్ కోర్టు ఎక్కడ ఫైల్ చేస్తారు అన్న భయంతోటి ప్రభుత్వం ఈ యొక్క జీవో ఆగమేఘాల మీద మంజురు చేసి శంకుస్థాపన  చేశారని అన్నారు .

ఇప్పుడున్న ఎమ్మెల్యే గానీ శంకుస్థాపనకు వచ్చినటువంటి మంత్రులు గాని మేము చేస్తున్నాము, మా ప్రభుత్వం చేస్తుంది అని ఏవైతే గొప్పలు చెప్పుకుంటున్నారు అదంతా అబద్ధమని ఇది రావడానికి కారణం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు పెట్టినా వాళ్ళని శ్రీకాంత్ గౌడ్ గుర్తు చేశారు.అదేవిధంగా ఈ కడుతున్నటువంటి ఆసుపత్రి ప్రాంగణంలో ఇంత పెద్ద ఆసుపత్రికి ఆ ప్రాంతం సరిపోదు ,పటాన్ చెరువు పరిసర ప్రాంతాలలో 25 ఎకరాల సువిశాలమైన ప్రదేశంలో దీన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ పోరాటంలో భాగస్వాములు అయినటువంటి  డాక్టర్ కిషన్ రావు ని ఆరుట్ల వెంకట్ రెడ్డి గారు, లగ్డారం గ్రామ నర్సింహరెడ్డి గారు, చిదురుప్పా గ్రామానికి చెందినటువంటి ముత్యాలు గారు ఇంకా అనేకమంది రైతులకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కృతజ్ఞతలు తెలిపాల్సిన అవసరం ఉందని, వారి పోరాట ఫలితమే ఈ యొక్క ఆసుపత్రి, నష్టపరిహారం ఇంకా తీర్పులో ఉన్నటువంటి వాటిపైన భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అవియ్యకుండా తాత్సారం చేసి వాళ్ళకి అన్యాయం చేస్తుందో దీనిపైన న్యాయపరంగా అదే రకంగా కచ్చితంగా ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉండి ఆ తీర్పులో ఉన్నటువంటి అన్ని ఫలాలు అర్హులైన వారికి చేరే వరకు క్రృషి చేస్తామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో దేవెందర్ గౌడ్, బీజేపీ మండల అధ్యక్షులు ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago