Telangana

పొడుభూముల సమస్యలు పరిష్కరించాలని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఆధ్వర్యంలో మంత్రి సత్యవతి రాథోడ్ కి వినతి

మనవార్తలు ,హైదరాబాద్:

ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఆధ్వర్యంలో గిరిజన సంక్షేమ సంఘం మరియు స్త్రీ ,శిశు సంక్షేమ సంఘం మంత్రి సత్యవతి రాథోడ్ ని కలిసి పొడుభూముల సమస్యలు పరిష్కరించాలని ,కొత్తగా ఏర్పాటు చేసిన తాండ గ్రామ పంచాయతీలను రెవెన్యూ గ్రామ పంచాయతీగా గుర్తించి నిధులు ఇవ్వాలి, కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీలలో రేషన్ సరుకులు ఏర్పాటు చేసి కొత్త డీలర్ షీప్ ఏర్పాటు చేసి సరుకులుప్రజల అందుబాటులో పంపిణీ చేయాలని, ST హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని 6% శాతం నుంచి 10% రిజర్వేషన్ పెంచాలని కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని గిరిజన శాఖామంత్రికి వినతి పత్రం సమర్పించిన ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో గిరిజన శాఖ మంత్రి వర్యులు మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ ని మర్యాదపూర్వకంగా కలిసి గిరిజన 10 శాతం రిజర్వేషన్ పెంపుపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి

నేడు తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేస్తున్న ఉద్యోగాలలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని లేని ఎడల 10% రిజర్వేషన్ అమలు చేయకుంటే తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేస్తున్న 84 వేల ఉద్యోగాల్లో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కావాలని కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ పెంచకుండా గిరిజన జీవితాలతో చెలగాటమాడుతుంది అందుకోసం టిఆర్ఎస్ పార్టీ పక్షాన రైతు పోరాటం చేసిన విధంగా ఢిల్లీలో గిరిజన రిజర్వేషన్ పెంపుపై కేసీఆర్ గారి నాయకత్వంలో ఢిల్లీలో పెద్ద ఎత్తున పిలుపు ఇవ్వాలని దానికి యావత్ గిరిజన ప్రజలు కదిలి వస్తారని అన్నారు .

మంత్రి సత్యవతి రాథోడ్ స్పందిస్తూ ప్రభుత్వం దృష్టికి కెసిఆర్ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు అలాగే మియపూర్ పరిధిలోని నడిగడ్డ తాండాలో గత 40సం. నుంచి ఉంటున్న గిరిజనులు CRPF వారి ఎదుర్కొంటున్న సమస్యలను  తాను ఉన్నత స్థాయి అధికారుల మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని  తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలిండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఇస్లావత్ రామచంద్రనాయక్ మరియు మోహన్ సింగ్ నాయక్ ,రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ దశరథ్ నాయక్ ,ఆంగోత్ హరి నాయక్ మరియు ఆల్ ఇండియా బంజారా సంఘం అన్ని జిల్లాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.

admin

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

12 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago