Telangana

బిస్లరి లో చట్ట విరుద్ధంగా తొలగించిన కార్మికులను వెంటనే తీసుకోవాలి

బిస్లరీ కార్మికులకు శాండ్విక్, పార్లే యూనియన్లు సంపూర్ణ మద్దతు

న్యాయం జరిగే వరకు కార్మికులు ఐక్యంగా పోరాడాలి

సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి. పాండురంగారెడ్డి

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి :

బిస్లెరి పరిశ్రమలో చట్ట విరుద్ధంగా తొలగించిన కార్మికులను వెంటనే తీసుకోవాలని, యాజమాన్యం మొండివైఖరి విడనాడి సమస్యల పరిష్కారం కోసం ముందుకు రావాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి పాండురంగారెడ్డి , బిస్లరీ యూనియన్ అధ్యక్షులు అతిమేల మాణిక్ యజమాన్యాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని ఐడిఏ పాశమైలారం పారిశ్రామిక వాడ లో గల బిస్లరీ పరిశ్రమ వద్ద జరిగిన కార్మికుల ఆందోళనకు శాండ్విక్ , పార్లే ఎంప్లాయిస్ యూనియన్లు సంఘీభావ మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా పి పాండురంగారెడ్డి మాట్లాడుతూ బిస్లరీ కార్మికులు న్యాయం జరిగే వరకు ఐక్యంగా ఉండి పోరాడాలని, బిస్లరీ కార్మికులకు శాండ్విక్ యూనియన్ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. చట్టం ప్రకారం యూనియన్ ఏర్పాటు చేసుకుంటే తప్పేముందని, యూనియన్ పెట్టుకుంటే యాజమాన్యం కక్ష సాధింపులు చర్యలు, వేధింపులకు గురి చేయటం సరికాదన్నారు.

కార్మికులను తొలగించడం చట్టానికి విరుద్ధం అని కార్మికులం తొలగించి 28రోజులు అయినా యాజమాన్యం స్పందించకపోవడం దారుణమన్నారు. మానిక్ మాట్లాడుతూ తొలగించిన బిస్లరి కార్మికుల వెంటనే తీసుకోని కార్మికుల న్యాయం చేయాలని అన్నారు. జిల్లా ఉన్నత అధికారులు స్పందించి కార్మికుల సమస్యను పరిష్కరించి పారిశ్రామిక ప్రశాంతతను నెలకొల్పాలన్నారు. తొలగించిన కార్మికులను బే షరతుగా వెంటనే తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరిశ్రమలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

చట్టాన్ని ఉల్లంఘించి కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న బిస్లెరీ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని లేపక్షంలో పెద్ద ఎత్తున కార్మికులను సమీకరించి పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. పార్లే యూనియన్ ట్రెజరర్ రాజశేఖర్ మాట్లాడుతూ కార్మికులను తొలగించడం అన్యాయమని వెంటనే తీసుకోవాలని, బిస్లరీ కార్మికులు చేస్తున్న న్యాయమైన పోరాటానికి పార్లే యూనియన్ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు.ఈ ఆందోళన కార్యక్రమంలో శాండ్విక్ యూనియన్ ఆఫీస్ బేరర్ సదాశివరెడ్డి, పార్లే యూనియన్ జనరల్ సెక్రెటరీ సంతోష్ గౌడ్, నాయకులు వాసుదేవరావు, రాజు, జనరల్ సెక్రెటరీ శేఖర్ రెడ్డి ఉపాధ్యక్షులు ప్రవీణ్ గౌడ్, జాయింట్ సెక్రెటరీలు కృష్ణ కుమార్, అజయ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సతీష్ గౌడ్ కమిటీ సభ్యులు రాము, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

5 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

5 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

5 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago