politics

పాశమైలారంలోఘనంగా మల్లికార్జున స్వామి విగ్రహప్రతిష్ఠాపన

మనవార్తలు , పటాన్ చెరు:

పాశమైలారం గ్రామంలో నూతనంగా నిర్మించిన మల్లికార్జున స్వామి విగ్రహప్రతిష్ఠాపన , ధ్వజస్తంభం ప్రతిష్టపాన ఘనంగా జరిగింది .ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే కె సత్యనారాయణ పూజలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనను ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

అనంతరం మాట్లాడుతూ నూతన భ్రమరాంబ మల్లికార్జున స్వామి విగ్రహము మందిరము నిర్మించడం చాలా అదృష్టకరమని, పాశమైలారం గ్రామంలోని ప్రజల మద్దతు చాలా ఉంది అని ఉప సర్పంచ్ మోటే కృష్ణ యాదవ్ కు ఈ పూజలో పాల్గొన్న ఈ మందిర నిర్మాణ కుటుంబ సభ్యులకు మరియు ప్రతి ఒక్కరికి భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆశీస్సులు దీవెనలు ఉండాలని ఆ పరమేశ్వరుడు రూపమైన మల్లికార్జున స్వామిని వేడుకుంటున్నాను అని అన్నారు అనంతరం ఉప సర్పంచ్ మోటే కృష్ణ యాదవ్ సత్యనారాయణను శాలువాతో సన్మానించారు ఈ ప్రతిష్టాపన కార్యక్రమానికి గ్రామస్తులతోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఆలయ కమిటీ నిర్వాహకులు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago