మనవార్తలు ,పటాన్ చెరు:
పటాన్చెరు మండల పరిధిలోని రుద్రారం గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాండు ,హనుమాన్ దీక్ష సేవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హనుమాన్ జయంతి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు .అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి ప్రత్యేక దర్శనం చేసుకున్నారు, శ్రీ వీరాంజనేయ స్వామి మందిరం లో నేడు హనుమాన్ జయంతి పురస్కరించుకొని హనుమాన్ దీక్ష సేవాసమితి ఆధ్వర్యంలో 54 అడుగుల వీరా ఆంజనేయస్వామి ఆలయంలో దగ్గర జెండా ఆవిష్కరణ చేసి శ్రీ ఆంజనేయ స్వామి మాల వేసుకున్న గురు స్వాములు సుమారు 1989 సంవత్సరం నుండి వారి ఆధ్వర్యంలో ఆంజనేయస్వామికి సింధూరం,పాలాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నాము అని అన్నారు గ్రామ ప్రజలు భక్తులు అధిక సంఖ్య లో పాల్గొని శ్రీ రామభక్త ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రుద్రారం గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఎంపిటిసి హరి ప్రసాద్ రెడ్డి, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు ,మరియు హనుమాన్ దీక్ష సేవా సమితి స్వాములు, మాజీ ఎంపీపీ మండల తెరాస పార్టీ అధ్యక్షులు గాయత్రి పాండు, గ్రామ ప్రజలు భక్తులు తదితరులు పాల్గొన్నార.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…