Hyderabad

జర్నలిస్ట్ లను ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించండి…

జర్నలిస్ట్ లను ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించండి…

ఎంపీ కోమటి రెడ్డి డిమాండ్

-సీఎం కేసీఆర్ కు లేఖ

– చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబానికి 25 లక్షల సాయం చేయాలి
-జర్నలిస్టులకు ప్రత్యేక వైద్యసదుపాయాలు కల్పించండి
జర్నలిస్టులను కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తిచాలని భవనగిరి పార్లమెంట్ సభ్యుడు . కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రలో అనేక మంది జరన్లిస్టులు కరోనా భారిన పది మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులు అనేక ఇబ్బందులు పడుతూ తన విధినిర్వహణలో ప్రాణాలు పోగుట్టుకుంటున్నారని అన్నారు. పోలీస్ , పారిశుధ్య కార్మికులు,, వైద్య సిబ్బంది లాగానే జర్నలిస్టులు కూడా పని చేస్తున్న విషయాన్నీ ఆయన గుర్తు చేశారు. అనేక రాష్ట్రాలు జర్నలిస్ట్ లను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి సదుపాయాలు కల్పిస్తున్నాయని తెలంగాణాలో ఎందుకు గుర్తించటంలేదో అర్థం కావడంలేదని కోమటిరెడ్డి అన్నారు. కేసీఆర్ వెంటనే జర్నలిస్టుల విషయంలో నిర్ణయం తీసుకోవాలని అన్నారు.

భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం, సిద్దిపేట జిల్లా , చేర్యాల మండలం చెందిన సాక్షి టీవీ రిపోర్టర్ చెలుకుల వెంకట్ రెడ్డి కరోనా తో మృతి చెందడం చాలా బాధాకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజెస్తున్నాను. ఇప్పటివరకు తెలంగాణాలో 100 మంది జర్నలిస్టులు కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. దేశం మొత్తంలో దాదాపు పదిహేను రాష్ట్రాలలో జర్నలిస్టులను “ఫ్రంట్ లైన్   వారియర్స్ ” గా గుర్తించారు. వారికి ప్రత్యేకంగా బెడ్లు కేటాయించి, ఉచిత వైద్యం రాష్ట్ర ప్రభుత్వాలు చేయిస్తున్నాయి. కరోనా తో చనిపోయిన జర్నలిస్టులకు ఐదు లక్షల రూపాయలు నష్ట పరిహారం కూడా చెల్లిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా తక్షణమే జర్నలిస్టులను “ఫ్రంట్ లైన్ వారియర్స్ ” గా గుర్తించాలి . వారికి ప్రత్యేకంగా బెడ్లు కేటాయించి, ఉచిత వైద్యం తెలంగాణ ప్రభుత్వం చేయించాలి . నిత్యం ప్రజల కోసం పని చేసే జర్నలిస్టులు కరోనాతో చనిపోతే ఐదు లక్షల రూపాయలు నష్ట పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ కి విజ్ఞప్తి చేస్తున్నాను.

Venu

Recent Posts

వందేమాతరం సామూహిక గీతాలాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…

3 days ago

ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి రామయ్య జన్మదిన వేడుకలు

చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…

3 days ago

గీతంలో ఉల్లాసంగా కేక్ మిక్సింగ్ వేడుక

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…

3 days ago

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…

1 week ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…

1 week ago

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…

1 week ago