Hyderabad

జర్నలిస్ట్ లను ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించండి…

జర్నలిస్ట్ లను ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించండి…

ఎంపీ కోమటి రెడ్డి డిమాండ్

-సీఎం కేసీఆర్ కు లేఖ

– చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబానికి 25 లక్షల సాయం చేయాలి
-జర్నలిస్టులకు ప్రత్యేక వైద్యసదుపాయాలు కల్పించండి
జర్నలిస్టులను కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తిచాలని భవనగిరి పార్లమెంట్ సభ్యుడు . కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రలో అనేక మంది జరన్లిస్టులు కరోనా భారిన పది మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులు అనేక ఇబ్బందులు పడుతూ తన విధినిర్వహణలో ప్రాణాలు పోగుట్టుకుంటున్నారని అన్నారు. పోలీస్ , పారిశుధ్య కార్మికులు,, వైద్య సిబ్బంది లాగానే జర్నలిస్టులు కూడా పని చేస్తున్న విషయాన్నీ ఆయన గుర్తు చేశారు. అనేక రాష్ట్రాలు జర్నలిస్ట్ లను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి సదుపాయాలు కల్పిస్తున్నాయని తెలంగాణాలో ఎందుకు గుర్తించటంలేదో అర్థం కావడంలేదని కోమటిరెడ్డి అన్నారు. కేసీఆర్ వెంటనే జర్నలిస్టుల విషయంలో నిర్ణయం తీసుకోవాలని అన్నారు.

భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం, సిద్దిపేట జిల్లా , చేర్యాల మండలం చెందిన సాక్షి టీవీ రిపోర్టర్ చెలుకుల వెంకట్ రెడ్డి కరోనా తో మృతి చెందడం చాలా బాధాకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజెస్తున్నాను. ఇప్పటివరకు తెలంగాణాలో 100 మంది జర్నలిస్టులు కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. దేశం మొత్తంలో దాదాపు పదిహేను రాష్ట్రాలలో జర్నలిస్టులను “ఫ్రంట్ లైన్   వారియర్స్ ” గా గుర్తించారు. వారికి ప్రత్యేకంగా బెడ్లు కేటాయించి, ఉచిత వైద్యం రాష్ట్ర ప్రభుత్వాలు చేయిస్తున్నాయి. కరోనా తో చనిపోయిన జర్నలిస్టులకు ఐదు లక్షల రూపాయలు నష్ట పరిహారం కూడా చెల్లిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా తక్షణమే జర్నలిస్టులను “ఫ్రంట్ లైన్ వారియర్స్ ” గా గుర్తించాలి . వారికి ప్రత్యేకంగా బెడ్లు కేటాయించి, ఉచిత వైద్యం తెలంగాణ ప్రభుత్వం చేయించాలి . నిత్యం ప్రజల కోసం పని చేసే జర్నలిస్టులు కరోనాతో చనిపోతే ఐదు లక్షల రూపాయలు నష్ట పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ కి విజ్ఞప్తి చేస్తున్నాను.

Venu

Recent Posts

ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించండి

విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…

8 hours ago

అంతర్జాతీయ సదస్సులో గీతం అధ్యాపకుడికి ఉత్తమ పత్ర అవార్డు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…

8 hours ago

గీతంలో వందేమాతరం 150వ వార్షికోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…

8 hours ago

సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర మరింత పెరగాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…

20 hours ago

మీ ఆలోచనే మీకు పెట్టుబడి

గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…

23 hours ago

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

2 days ago