హనుమంతుడి జన్మస్థలంపై వివాదం…
– టీటీడీ వర్సెస్ శ్రీహనుమద్ జన్మభూమి తీర్థ ట్రస్టు!
-ఆంజనేయుడి జన్మస్థలం అంజనాద్రేనన్న టీటీడీ
-ఖండిస్తూ తీవ్ర ఆరోపణలు చేసిన జన్మభూమి తీర్థ ట్రస్ట్
-కాదని నిరూపించాలని సవాలు విసురుతూ లేఖ రాసిన టీటీడీ
రామబంటు హనుమంతుడి జన్మస్థలం విషయంలో వివాదాలు నెలకొన్నాయి. ఆయన పుట్టుకపై టీటీడీ ,శ్రీహనుమద్ తీర్థ ట్రస్ట్ మధ్య నెలకొన్న వివాదం పై చర్చ మొదలైంది. తిరుమల తిరుపతి దేవస్థానం, కర్ణాటక కిష్కింధలోని శ్రీహనుమద్ జన్మభూమి తీర్థ ట్రస్ట్ మధ్య వివాదం మొదలైంది. తిరుమలలోని అంజనాద్రిలోనే హనుమంతుడు పుట్టాడని టీటీడీ చేసిన ప్రకటనను శ్రీ హనుమద్ జన్మభూమి ట్రస్టు ఖండిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీనిపై టీటీడీ స్పందించింది. జన్మభూమి తీర్థ ట్రస్టు చేసిన ఆరోపణలు నిరాధారమైనవని తేల్చి చెబుతూ టీటీడీ ఆధ్వర్యంలోని ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి లేఖ రాశారు.
టీటీడీ పండిత పరిషత్ నాలుగు నెలలపాటు శోధించిన అనంతరం పౌరాణిక, శాసన, భౌగోళిక ఆధారాలతోనే ఈ ప్రకటన చేసినట్టు ఆ లేఖలో వివరించారు. అంజనాద్రే హనుమంతుడి జన్మస్థలమని శాస్త్రీయంగా నిరూపించే సంక్షిప్త నివేదికను సమర్పించామని పేర్కొన్నారు. నివేదికలో పేర్కొన్న ఆధారాలు, ప్రమాణాలు అసత్యాలని ట్రస్టు వ్యవస్థాపకులు నిరూపించాలని సవాలు విసిరారు. తగిన ఆధారాలతో ఈ నెల 20లోపు
నివేదికను సమర్పించాలని కోరారు. అంతేకాదు, టీటీడీపై చేసిన దూషణలకు లిఖిత పూర్వక క్షమాపణలు చెప్పాలని ఆ లేఖలో డిమాండ్ చేశారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…