Telangana

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి – శేరిలింగంపల్లి :

తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని తీర్మానించారు. శేరిలింగంపల్లి డివిజన్ కు చెందిన యువ నాయకుడు పొట్ట నరేందర్ యాదవ్, సీనియర్ నాయకులు మల్లికార్జున శర్మ ల సంయుక్త ఆధ్వర్యంలో* లింగంపల్లి హుడా ట్రేడ్ సెంటర్ శ్రీకరణ్ బ్యాంకెట్ హాల్ లో బిఆర్ఎస్ పార్టీ లో క్రియాశీలకంగా పని చేసిన ఉద్యమ కారులకు సన్మానం చేసి మెమెంటో తో సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు చేసి, ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకొని పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం లో ఉద్యమ కారులకు సరైన న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్ల స్వరాష్ట్రం లోనూ అన్యాయమే జరిగిందనీ సాక్షాత్తు అధిష్టాన వర్గం కూడా ఒప్పుకున్నధని గుర్తు చేశారు. పార్టీ కి పనిచేస్తూ ఉంటే పార్టీ ఏదో ఒక్క చోట ఈ సారీ అకామిడేట్ చేస్తుందనే నమ్మకం ఉందినీ చెప్పుకొచ్చారు.ఈ సారి అలా అందరం కలిసి కట్టుగా ఉంటూ పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినా మన అభ్యర్థులను గెలిపించుకుందామని ముక్తకంఠం తో తీర్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉద్యమకారులు సామ వెంకట్ రెడ్డి, కే. శ్రీనివాస్ రెడ్డి, పురుషోత్తం యాదవ్, వెంకట్ యాదవ్, మల్లా రెడ్డి, నగేశ్ , విజయ లక్ష్మీ,, పలువురు బిఆర్ఎస్ సీనియర్ నాయకులు బొబ్బ నవత రెడ్డి, మమత, రోజా,సతీష్ ఎర్రబెల్లి, శ్రీనివాస్ గౌడ్, కార్తిక్, విజయ్ రెడ్డి, సంతోష్ నాయుడు, టి. సంతోష్ రెడ్డి మరియు సీనియర్, యువ నాయకులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

6 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

6 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

6 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

7 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

7 hours ago