మనవార్తలు ప్రతినిధి – శేరిలింగంపల్లి :
తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని తీర్మానించారు. శేరిలింగంపల్లి డివిజన్ కు చెందిన యువ నాయకుడు పొట్ట నరేందర్ యాదవ్, సీనియర్ నాయకులు మల్లికార్జున శర్మ ల సంయుక్త ఆధ్వర్యంలో* లింగంపల్లి హుడా ట్రేడ్ సెంటర్ శ్రీకరణ్ బ్యాంకెట్ హాల్ లో బిఆర్ఎస్ పార్టీ లో క్రియాశీలకంగా పని చేసిన ఉద్యమ కారులకు సన్మానం చేసి మెమెంటో తో సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు చేసి, ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకొని పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం లో ఉద్యమ కారులకు సరైన న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్ల స్వరాష్ట్రం లోనూ అన్యాయమే జరిగిందనీ సాక్షాత్తు అధిష్టాన వర్గం కూడా ఒప్పుకున్నధని గుర్తు చేశారు. పార్టీ కి పనిచేస్తూ ఉంటే పార్టీ ఏదో ఒక్క చోట ఈ సారీ అకామిడేట్ చేస్తుందనే నమ్మకం ఉందినీ చెప్పుకొచ్చారు.ఈ సారి అలా అందరం కలిసి కట్టుగా ఉంటూ పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినా మన అభ్యర్థులను గెలిపించుకుందామని ముక్తకంఠం తో తీర్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉద్యమకారులు సామ వెంకట్ రెడ్డి, కే. శ్రీనివాస్ రెడ్డి, పురుషోత్తం యాదవ్, వెంకట్ యాదవ్, మల్లా రెడ్డి, నగేశ్ , విజయ లక్ష్మీ,, పలువురు బిఆర్ఎస్ సీనియర్ నాయకులు బొబ్బ నవత రెడ్డి, మమత, రోజా,సతీష్ ఎర్రబెల్లి, శ్రీనివాస్ గౌడ్, కార్తిక్, విజయ్ రెడ్డి, సంతోష్ నాయుడు, టి. సంతోష్ రెడ్డి మరియు సీనియర్, యువ నాయకులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…