Telangana

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ క్రీడాకారులు అద్భుతమైన ప్రదర్శన అందించి భారతదేశ గొప్పతనాన్ని అంతర్జాతీయ వేదికపై గర్వపడేలా చేయడం అభినందనీయమని పటాన్‌చెరు శాసన సభ్యులు, మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ రాష్ట్ర చీఫ్ ప్యాట్రాన్ గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.
గత నెల 23, 24వ తేదీలలో శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన మాస్టర్స్ అథ్లెటిక్స్ ఇంటర్నేషనల్ మీట్ లో భారత దేశం తరపున సంగారెడ్డి జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ కు చెందిన 14 మంది క్రీడాకారులు (35 సంవత్సరాల నుండి 100 సంవత్సరాల లోపు) వివిధ క్రీడా పోటీలలో పాల్గొన్నారు. మొత్తం 52 పతకాలు సాధించగా వీటిలో బంగారు పతకాలు 27, వెండి పతకాలు 11, కంచు పతకాలు 4 ఉన్నాయి. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే జిఎంఆర్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. గత 20 సంవత్సరాలుగా తమ క్రీడా పోటీలకు సంపూర్ణ సహకారం అందిస్తున్న ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ 80, 90 ఏళ్ల వృద్ధాప్యంలోను అంతర్జాతీయ పోటీలలో పాల్గొని ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని అభినందించారు. రాబోయే రోజుల్లోనూ మరిన్ని పథకాలు సాధించాలని అభిలాషించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఫహీం ఇక్బాల్, ప్రధాన కార్యదర్శి శామ్యూల్, ఉపాధ్యక్షులు బాలయ్య, నరేందర్ రెడ్డి, భాస్కరరావు, ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎల్లోర, సభ్యులు కరుణాకర్ రావు, మల్లయ్య గౌడ్, నిర్మల, అనసూయ, సరోజినీ, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

1 hour ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

1 hour ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

1 hour ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago