_ప్రగతిరథ సాధకుడికి అభినందనల వెల్లువ
_ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరింత అభివృద్ధి
పటాన్చెరు నియోజకవర్గం నుండి మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని అందించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరింత బాధ్యతతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతూ సంక్షేమాన్ని మరింత విస్తృతం చేస్తామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.ఇటీవల జరిగిన శాసనసభ అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్చెరు నియోజకవర్గం నుండి మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధించిన సందర్భంగా సోమవారం పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో నియోజకవర్గ పరిధిలోని వివిధ స్థాయిల ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ని ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం దశాబ్ది కాలంలో 9వేల కోట్ల రూపాయలతో పటాన్చెరు నియోజకవర్గాన్ని అభివృద్ధికి ప్రతీకగా నిలిపామని తెలిపారు. రాబోయే రోజుల్లోనూ ప్రజల మద్దతుతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడంతోపాటు అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేస్తామని తెలిపారు. తన విజయానికి సంపూర్ణ సహకారం అందించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…
పికిల్ బాల్ పోటీలలో ప్రతిభ చాటిన బీ.ఆర్క్. విద్యార్థిని ఆశ్రిత రాజు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం డీమ్డ్…
54 మంది లబ్ధిదారులకు 24 లక్షల 43 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,…
వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో…