Telangana

హ్యాట్రిక్ విజయం మరింత బాధ్యత పెంచింది_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_ప్రగతిరథ సాధకుడికి అభినందనల వెల్లువ

_ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరింత అభివృద్ధి

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

పటాన్చెరు నియోజకవర్గం నుండి మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని అందించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరింత బాధ్యతతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతూ సంక్షేమాన్ని మరింత విస్తృతం చేస్తామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.ఇటీవల జరిగిన శాసనసభ అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్చెరు నియోజకవర్గం నుండి మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధించిన సందర్భంగా సోమవారం పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో నియోజకవర్గ పరిధిలోని వివిధ స్థాయిల ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ని ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం దశాబ్ది కాలంలో 9వేల కోట్ల రూపాయలతో పటాన్చెరు నియోజకవర్గాన్ని అభివృద్ధికి ప్రతీకగా నిలిపామని తెలిపారు. రాబోయే రోజుల్లోనూ ప్రజల మద్దతుతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడంతోపాటు అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేస్తామని తెలిపారు. తన విజయానికి సంపూర్ణ సహకారం అందించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

admin

Recent Posts

వందేమాతరం సామూహిక గీతాలాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…

3 days ago

ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి రామయ్య జన్మదిన వేడుకలు

చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…

3 days ago

గీతంలో ఉల్లాసంగా కేక్ మిక్సింగ్ వేడుక

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…

3 days ago

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…

1 week ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…

1 week ago

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…

1 week ago