Telangana

విద్యా పరిశోధన కోసం గీతం ఫ్రొఫెసర్ కు యూకే ఆహ్వానం

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

గీతం స్కూల్ ఆఫ్ సెన్స్టిలోని గణిత శాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ మోతహర్ రెజా ఈనెల 1 నుంచి 15 తేదీ వరకు విద్యా పరిశోధన చేపట్టడానికి యునెటైడ్ కింగ్డమ్ (బ్రిటన్)లోని డూండీ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ సెన్ట్స్ అండ్ ఇంజనీరింగ్ ఆహ్వానించింది.యూనివర్సిటీ ఆఫ్ డూండీలోని ఎన్విరాన్మెంటల్ ఫ్యూయిడ్ మెకానిక్స్ లెక్చరర్ డాక్టర్ అనిర్బన్ గుహా ‘స్లిప్వాల్ ఎఫెక్ట్స్ ఆన్ మెక్రోచానెల్ ఫ్లూయిడ్ స్టెబిలిటీ అండ్ బయోమెడికల్ డివెస్ట్ అప్లికేషన్స్’ అనే అంశంపై పరిశోధన చేపట్టేందుకు డాక్టర్ రెజాను ఆహ్వానించారు. ప్రొఫెసర్ రెజా పర్యటనకు భారత ప్రభుత్వ సంస్థ సెర్చ్ లోని గణితపరిశోధన ప్రభావం కేంద్రీకృత మద్దతు (మాట్రిక్స్) కార్యక్రమం ద్వారా ఆర్థిక సౌజన్యాన్ని అందిస్తోంది. విదేశాల్లోని విశ్వవిద్యాలయాలతో పరిశోధన సహకారాన్ని పెంపొందించడం, గీతం హెదరాబాద్ లోని గణితశాస్త్ర విభాగాన్ని మరింతప్రోత్సహించడం లక్ష్యం డాక్టర్ రెజు ఈ పర్యటనను చేపట్టారు. ఈ సహకారం ఆయన పరిశోధన పురోగతికి గణనీయంగా దోహదపడుతుందని, అదనపు నిధుల అవకాశాలను సృష్టించగలదని భావిస్తున్నారు. ఈ ఏడాది డాక్టర్రెజా నాలుగు వ్యాసాలను ప్రముఖ సెంటిఫిక్ జర్నళ్లలో ప్రచురించడం పరిశోధన పట్ల ఆయన నెపుణ్యం, అంకితభావాన్ని తెలియజేస్తోంది.డాక్టర్ రోజాకు దక్కిన ఈ గౌరవం పట్ల గీతం ఉపకులపతి ప్రొఫెసర్ దయానంద సిద్ధవట్టం, గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు, రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సెన్ట్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దత్తాత్రి కె.నగేశ, సిస్ట్స్ డీన్ ప్రొఫెసర్ కొల్లూరు శ్రీకృష్ణ, మేనేజ్మెంట్ డీన్-పరిశోధన డెరైక్టర్ డాక్టర్ రాజా ఫణి పప్పు, వివిధ విభాగాల అధిపతులు, సహోధ్యాపకులు పలువురు హర్షం వెలిబుచ్చడమే గాక, ఆయనను అభినందించారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago