Telangana

వినూత్న ప్రాజెక్టులను ప్రదర్శించిన గీతం విద్యార్థులు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్లోని స్కూల్ ఆఫ్ టెక్నాలజీ బీ.టెక్ తొలి ఏడాది విద్యార్థులు సోమవారం తమ వినూత్నమైన ప్రాజెక్టులకు ప్రదర్శించారు. సాంకేతిక అన్వేషణ, ఉత్పత్తి ఇంజనీరింగ్ (టీఈపీ టెప్) కార్యక్రమంలో భాగంగా, ప్రస్తుత విద్యా సంవత్సరంలో అభివృద్ధి చేసిన వినూత్న ప్రాజెక్టుల ఎగ్జిబిషన్ ను గీతం విద్యార్థులు నిర్వహించారు.బీటెక్ తొలి ఏడాది విద్యార్థులలో సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన, సమస్య పరిష్కార నెపుణ్యాలను పెంపొందించడం, ప్రయోగాత్మక విధానాన్ని పెంపొందించడంపై ఈ కార్యక్రమం దృష్టి సారించింది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), ప్రోగ్రామింగ్, సిమ్యులేషన్, మెకానిజమ్స్, మ్యాచింగ్ కలయికను ఉపయోగించడం ద్వారా బహుళ- క్రమశిక్షణా ప్రాజెక్టు-ఆధారిత సామర్థ్యాలను ఇది ప్రోత్సహిస్తుంది. దీనికి అదనంగా, ప్రాజెక్టు మేనేజ్మెంట్, సంస్థాగత నెపుణ్యాలతో విద్యార్థులను సన్నద్దం చేస్తుంది.విద్యార్థులు తమ అభ్యాసాలను ప్రదర్శించడానికి ఈ ప్రాజెక్టు ఎగ్జిబిషన్ ఒక వేదికగా ఉపయోగపడింది. ఈ సెమిస్టర్లో సుమారు 15 గ్రూపుల విద్యార్థులు పాల్గొని, సూక్ష్మంగా రూపొందించిన నమూనాలను ప్రదర్శించారు.త్రిపుర విద్యుత్ నియంత్రణ సంస్థ (టీఈఆర్సీ) చెర్మన్ డి.రాధాకృష్ణ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉత్సాహపరిచారు. మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ప్రొఫెసర్ పి.శ్రీనివాస్, బీటెక్ తొలి ఏడాది ప్రోగ్రాం ఇన్చార్జి ప్రొఫెసర్ పి.త్రినాథరావు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. గీతం, హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డి.ఎస్.రావు ఈ ఎగ్జిబిషన్ను సందర్శించి, అద్భుత సృజనాత్మకతను ప్రదర్శించిన విద్యార్థులను హృదయపూర్వకంగా అభినందించారు.విద్యార్థులు తమ సాంకేతిక నెపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఈ ప్రాజెక్ట్ ఎగ్జిబిషన్ అవకాశం కల్పించడమే కాకుండా ఆవిష్కరణ, ఆచరణాత్మక అభ్యాసాన్ని పెంపొందించడంలో గీతం నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

5 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago