Telangana

పటాన్చెరు ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రభుత్వ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

నవ సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులని, భావి భారత పౌరులను తయారు చేయాల్సిన గురుతర బాధ్యత వారిపై ఉందని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో గురువారం ఏర్పాటు చేసిన నియోజకవర్గస్థాయి ప్రభుత్వ పాఠశాల గురుపూజోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలోని విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొని వస్తున్నారని అన్నారు. గత 25 సంవత్సరాలుగా ప్రతి ఏటా గురుపూజోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసి, ఉత్తమ గురువులను సన్మానించడం సంతోషకరంగా ఉందని తెలిపారు. విద్యార్థులకు చదువుతోపాటు నైతిక విలువలు బోధించాలని, క్రీడల పై ఆసక్తి పెంపొందించేలా కార్యక్రమాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. పటాన్చెరు నియోజకవర్గంలోని ప్రతి పాఠశాలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దడం జరిగిందని తెలిపారు. . విద్యారంగాన్ని బలోపేతం చేయడంతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాలు, రెసిడెన్షియల్ కళాశాలలో, మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేసి బడుగు బలహీన విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో సీట్ల కోసం ప్రతిరోజు తల్లిదండ్రుల నుండి వినతి పత్రాలు వస్తున్నాయని, ఇది సంతోషకరమైన పరిణామం అన్నారు. అనంతరం పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల పరిధిలో విధులు నిర్వహిస్తున్న 75 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. గత 25 సంవత్సరాలుగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ నేతృతంలో ప్రతి సంవత్సరం గురుపూజోత్సవ వేడుకలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం ఆయా పాఠశాలల విద్యార్థిని విద్యార్థులచే ప్రదర్శించబడిన సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ అలరించాయి.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారులు పీపీ రాథోడ్, జెమిని కుమారి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి, వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, విద్యార్థిని విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

5 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

5 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago