Telangana

సామర్థ్యం అంచనా ప్రోత్సహకరంగా ఉండాలి

పరీక్ష పేపర్లు, మూల్యాంకన రూపకల్పన కార్యశాలలో ముఖ్య అతిథి డాక్టర్ లీనా

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

విద్యార్థి సామర్థ్యాలను పరిశీలించే పద్ధతి, మూల్యాంకన విధానాలను వారిని ప్రోత్సహించి, మరింత పూనికతో పనిచేసేలా ఉండాలని ఇఫ్లూ విశ్వవిద్యాలయం, లఖిల భారత భాషోపాధ్యాయుల సంఘం డైరెక్టర్ డాక్టర్ లీనా ముఖోపాధ్యాయ స్పష్టీకరించారు. గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, హైదరాబాద్ ఆధ్వర్యంలో ‘ప్రభావవంతంగా పరీక్ష పేపర్లు అభివృద్ధి చేయడం: బ్లూమ్ యొక్క వర్గీకరణ, మూల్యాంకన రూపకల్పనో అనే అంశంపై గురువారం నిర్వహించిన ఒకరోజు కార్యశాలలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కంటెంట్ మూల్యాంకనం యొక్క క్లిష్టమైన అంశాలపై ప్రస్తుతం అధ్యాపకులు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లను పరిష్కరించేలా పలు సూచనలతో ఆమె ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. ప్రభావంతమైన కంటెంట్ ను అభివృద్ధి చేయడానికి సవరించిన బ్లూమ్ వర్గీకరణ, కాగ్నిషన్ పరికల్పన ఆవశ్యకతను ఆమె నొక్కి చెప్పారు.గుర్తుంచుకోవడం, అర్థం చేసుకోవడం, విశ్లేషించడం, మూల్యాంకనం చేయడం, సృజనాత్మకంగా వ్యవహ రించడం వంటి ముఖ్య అంశాలపై ఆమె దృష్టి సారించారు. విద్యార్థి సామర్థ్యాన్ని మదింపు చేసేవారిగా ఉపాధ్యాయుల పాత్ర, అభ్యాస, ప్రక్రియలో విద్యార్థుల ఏకాగ్రతను పెంపొందించడంపై ఆమె ప్రసంగించారు.
జీఎస్ హెచ్ ఎస్ డైరెక్టర్ ప్రొఫెసర్ జి.సన్నీ జోస్ కార్యక్రమాన్ని ప్రారంభించి, ముఖ్య అతిథిని సత్కరించారు. అధ్యాపకులు తమ బోధనా పద్ధతులలో చేసుకోవాల్సిన మార్పులు, స్వీయ అంచనా ఆవశ్యకతను ఆయన నొక్కి చెబుతూ, ఈ కార్యశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆంగ్ల విభాగం అసోసియేట్ ప్రొఫెసర్లు డాక్టర్ అమిత్ కుమార్, డాక్టర్ రూత్ జర్జ్ మావి హౌజెల్ ల సమన్వయంతో సాగిన ఈ కార్యశాల, అధ్యాపకుల వికాసానికి, విద్యా పద్ధతులను మెరుగుపరచుకోవడానికి, వృత్తిపర అభివృద్ధికి తోడ్పడింది.

గీతమ్ లో ఘనంగా ఓనం ఉత్సవాలు

కేరళ వార్షిక పంటల, సాంస్కృతిక పండుగ ఓనంను గురువారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని డైరెక్టరేట్ ఆఫ్ స్టూడెంట్ లైఫ్ వారు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా గీతం విద్యార్థులకు సెంట్రల్ లాన్లో సంప్రదాయ ఆటలు, శివాజీ ఆడిటోరియంలో సాంస్కృతిక ప్రదర్శనలతో పాటు వివిధ కార్యక్రమాలు: నిర్వహించారు.అందంగా అలంకరించిన పూల రంగోలి, శక్తివంతమైన కేరళ డ్రమ్ ప్రదర్శన (చెండా మేళం)లకు ఆకట్టుకునే సాంస్కృతిక ప్రదర్శనలు తోడై ఉత్సావాలకు మరింత శోభనిచ్చాయి, ఈ సందర్భంగా గీతం కేఫ్ లో పాయసం, ఇతర సంప్రదాయ కేరళ వంటకాలతో కూడిన ఓనం నేపథ్యంతో కూడిన ప్రత్యేక విందును కూడా ఏర్పాటు చేశారు.విద్యార్థులు కేరళ సంప్రదాయ వస్త్రధారణలో ఉత్సాహంగా ఆయా వేడుకలలో పాల్గొని, ఇదో మరుపురాని రోజుగా చేశారు. ఈ కార్యక్రమం పలు నేపథ్యాల నుంచి వచ్చిన విద్యార్థులందరినీ ఒకచోట చేర్చి వారిలో ఐక్యతను పెంపొందించడంతో పాటు సాంస్కృతిక నైపుణ్యాలకు పదును పెట్టింది అనడంలో అతిశయోక్తి లేదు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

7 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

7 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

8 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

3 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

3 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

3 days ago