Telangana

పటాన్‌చెరులో ప్రభుత్వ నాయబ్ ఖ్వాజీ కార్యాలయం ప్రారంభం

-పటాన్‌చెరు రామచంద్రపురం అమీన్‌పూర్ జిన్నారం మండలాలకు

ప్రభుత్వ నాయబ్ ఖ్వాజీగా హాఫిజ్ మొహమ్మద్ ఇబ్రహీం నియామకం

-ఖ్వాజీ ఆఫీసులు మైనారిటీ సంక్షేమ శాఖ పరిధిలో ప్రాంతీయ వక్ఫ్ బోర్డుల ఆమోదంతో పనిచేస్తాయి

-ముస్లిం వివాహాల రిజిస్ట్రేషన్ చట్టపరంగా నాయబ్ ఖ్వాజీ హాఫిజ్ మొహమ్మద్ ఇబ్రహీం ద్వారా చేయించుకోవాలి

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :

పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని శాంతినగర్ కాలనీలో తెలంగాణ ప్రభుత్వ నాయబ్ ఖ్వాజీ కార్యాలయం అధ్యక్ష ఖ్వాజీ హాజీ సయ్యద్ లతీఫ్ అలీ ఖాద్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పటాన్‌చెరు నియోజకవర్గానికి సంబంధించిన నాలుగు మండలాల ముస్లిం వివాహాల రిజిస్ట్రేషన్ నాయబ్ ఖ్వాజీ హాఫిజ్ మొహమ్మద్ ఇబ్రహీం ను సంప్రదించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేసుకోవాలని తెలిపారు. ముస్లిం వివాహం నిఖా జరిగిన తర్వాత, ఆ వివాహాన్ని రిజిస్టర్ చేయడం చట్టపరంగా ముఖ్యమని తెలిపారు.దీనికోసం ఖాజీ కార్యాలయంలో నిఖా నామా నమోదు చేస్తారని తెలిపారు. వధూవరులు ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్ పోర్టు సైజ్ ఫోటోలు,ఆహ్వాన పత్రికను సమర్పించి తమ వివాహాన్ని రిజిస్టర్ చేయించుకోవాలని తెలిపారు.ఖ్వాజీ జారీ చేసిన నిఖా నామా భారత చట్టం ప్రకారం చెల్లుబాటు అయ్యే సాక్ష్యంగా పరిగణించబడుతుందని తెలిపారు. క్వాజీ కార్యాలయాలు మైనారిటీ సంక్షేమ శాఖ పరిధిలో, ప్రాంతీయ వక్ఫ్ బోర్డు ఆమోదంతో పనిచేస్తాయని, వివాహాలు ధార్మిక కార్యకలాపాల కోసం ఇది ఏర్పాటు చేయబడతాయని, ఖ్వాజీ కార్యాలయ అధికారిక గుర్తింపు కోసం తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు వెబ్ సైట్ ను సంప్రదించడం మంచిదని తెలిపారు. ఈ కార్యక్రమంలో వారితోపాటు సయ్యద్ జహీర్, ఇమామ్ సహాబ్ జామ మస్జిద్ బిహెచ్ఇఎల్ మొహమ్మద్ అబ్దుల్ సత్తార్, డాక్టర్ ఫహీం, ఇస్మాయిల్, జావిద్ హుస్సేన్, ముజీబుర్ రహ్మాన్, సలీం ఖాన్, ముస్తఫా, అన్సార్, సమీర్, యూసుఫ్, వాజిద్, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago