మనవార్తలు ,పటాన్చెరు:
టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి దీక్షలు ,ధర్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉందని గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ లోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.టీఆర్ఎస్ నేతలు చేపట్టిన దీక్షల్లో ఒక్క రైతు లేడని విమర్శించారు. పటాన్ చెరు నియోజకవర్గం శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి చేపట్టిన ధర్నాలో కేవలం గులాబీదళం మాత్రమే ఉందని.రైతులు లేరని గడీల శ్రీకాంత్ గౌడ్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రాంతంలో పండించిన పంటను కొనుగోలు చేస్తాము అని చెప్పింది కానీ.కొనుగోలు చేయమని చెప్పలేదన్నారు.వడ్ల కొనుగోలు విషయంలో టీఆరఎస్ ప్రభుత్వం అబద్దాలు ప్రచారం చేస్తుందని బిజేపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగడీల శ్రీకాంత్ గౌడ్ గడీల శ్రీకాంత్ గౌడ్ విమర్శించారు.
వడ్ల కొనుగోలు విషయంలో ప్రజలకు,రైతులకు వాస్తవాలను తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. రైతుల గురించి ధర్నా చేసే ముందు పెంచిన విద్యుత్ ఛార్జీలు ఏ రకంగా పెంచారు ప్రజలకు తెలియజేయాలన్నారు. రైతులు పంటను అమ్ముకునేందుకు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మీరు ఏర్పాటు చేసిన మీ సొంత క్రషర్ మైనింగ్ ల వల్ల పంట పండించుకునే వీలు కూడా లేకుండా ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు .ఈ విషయంపై గూడెం మహిపాల్ రెడ్డి ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు.
బిజెపి నేతలు ధర్నాలకు దిగితే బీజేపీ నేతలను పోలీసులచే గృహనిర్బంధం చేస్తున్నారని ఆరోపించారు. ఈరోజు టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న ధర్నాలకు దగ్గరుండి బందోబస్తు ఇవ్వడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు మధుకర్ రెడ్డి, మరియు ఎస్.ఆర్.కే యువసేన సభ్యులు శకిల్, బండి నర్సింగ్ యాదవ్, కమాలకర్ రెడ్డి, దుర్గా సాయి, మల్క పురం సాయి తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…