మనవార్తలు ,పటాన్చెరు:
టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి దీక్షలు ,ధర్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉందని గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ లోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.టీఆర్ఎస్ నేతలు చేపట్టిన దీక్షల్లో ఒక్క రైతు లేడని విమర్శించారు. పటాన్ చెరు నియోజకవర్గం శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి చేపట్టిన ధర్నాలో కేవలం గులాబీదళం మాత్రమే ఉందని.రైతులు లేరని గడీల శ్రీకాంత్ గౌడ్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రాంతంలో పండించిన పంటను కొనుగోలు చేస్తాము అని చెప్పింది కానీ.కొనుగోలు చేయమని చెప్పలేదన్నారు.వడ్ల కొనుగోలు విషయంలో టీఆరఎస్ ప్రభుత్వం అబద్దాలు ప్రచారం చేస్తుందని బిజేపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగడీల శ్రీకాంత్ గౌడ్ గడీల శ్రీకాంత్ గౌడ్ విమర్శించారు.
వడ్ల కొనుగోలు విషయంలో ప్రజలకు,రైతులకు వాస్తవాలను తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. రైతుల గురించి ధర్నా చేసే ముందు పెంచిన విద్యుత్ ఛార్జీలు ఏ రకంగా పెంచారు ప్రజలకు తెలియజేయాలన్నారు. రైతులు పంటను అమ్ముకునేందుకు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మీరు ఏర్పాటు చేసిన మీ సొంత క్రషర్ మైనింగ్ ల వల్ల పంట పండించుకునే వీలు కూడా లేకుండా ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు .ఈ విషయంపై గూడెం మహిపాల్ రెడ్డి ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు.
బిజెపి నేతలు ధర్నాలకు దిగితే బీజేపీ నేతలను పోలీసులచే గృహనిర్బంధం చేస్తున్నారని ఆరోపించారు. ఈరోజు టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న ధర్నాలకు దగ్గరుండి బందోబస్తు ఇవ్వడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు మధుకర్ రెడ్డి, మరియు ఎస్.ఆర్.కే యువసేన సభ్యులు శకిల్, బండి నర్సింగ్ యాదవ్, కమాలకర్ రెడ్డి, దుర్గా సాయి, మల్క పురం సాయి తదితరులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…