Districts

ప్రభుత్వంలో ఉన్ననేతలు ధర్నాచేయడం హాస్యాస్పదం _బిజేపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగ‌డీల శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు ,పటాన్‌చెరు:

టీఆర్ఎస్ ప్ర‌భుత్వం అధికారంలో ఉండి దీక్షలు ,ధ‌ర్నాలు చేయ‌డం హాస్యాస్ప‌దంగా ఉంద‌ని గ‌డీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ లోని తన కార్యాలయంలో మీడియా స‌మావేశం నిర్వ‌హించారు.టీఆర్ఎస్ నేత‌లు చేప‌ట్టిన దీక్ష‌ల్లో ఒక్క రైతు లేడ‌ని విమ‌ర్శించారు. ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గం శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి చేప‌ట్టిన ధర్నాలో కేవ‌లం గులాబీదళం మాత్ర‌మే ఉంద‌ని.రైతులు లేర‌ని గ‌డీల శ్రీకాంత్ గౌడ్ విమ‌ర్శించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రాంతంలో పండించిన పంటను కొనుగోలు చేస్తాము అని చెప్పింది కానీ.కొనుగోలు చేయ‌మ‌ని చెప్ప‌లేద‌న్నారు.వడ్ల కొనుగోలు విషయంలో టీఆరఎస్ ప్ర‌భుత్వం అబ‌ద్దాలు ప్ర‌చారం చేస్తుందని బిజేపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగ‌డీల శ్రీకాంత్ గౌడ్  గ‌డీల శ్రీకాంత్ గౌడ్ విమ‌ర్శించారు.

వ‌డ్ల కొనుగోలు విష‌యంలో ప్ర‌జ‌ల‌కు,రైతుల‌కు వాస్తవాలను తెలియ‌జేయాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వానికి ఉంద‌న్నారు. రైతుల గురించి ధర్నా చేసే ముందు పెంచిన విద్యుత్ ఛార్జీలు ఏ రకంగా పెంచారు ప్రజలకు తెలియజేయాలన్నారు. రైతులు పంటను అమ్ముకునేందుకు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మీరు ఏర్పాటు చేసిన మీ సొంత క్రషర్ మైనింగ్ ల వల్ల పంట పండించుకునే వీలు కూడా లేకుండా ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు .ఈ విషయంపై గూడెం మ‌హిపాల్ రెడ్డి ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు.

బిజెపి నేత‌లు ధర్నాల‌కు దిగితే బీజేపీ నేత‌ల‌ను పోలీసులచే గృహ‌నిర్బంధం చేస్తున్నార‌ని ఆరోపించారు. ఈరోజు టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న ధర్నాలకు దగ్గరుండి బందోబస్తు ఇవ్వడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు మధుకర్ రెడ్డి, మరియు ఎస్.ఆర్.కే యువసేన సభ్యులు శకిల్, బండి నర్సింగ్ యాదవ్, కమాలకర్ రెడ్డి, దుర్గా సాయి, మల్క పురం సాయి త‌దిత‌రులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago