– గీతం కార్యశాలలో పేర్కొన్న భాభా అణు పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు
మనవార్తలు ,పటాన్చెరు:
రోగ నిర్ధారణలో రేడియో ఐసోటోప్లు కీలక భూమిక పోషిస్తున్నాయని భాభా అణుపరిశోధనా సంస్థ ( బార్క్ ) లోని రేడియోఫార్మాస్యూటికల్స్ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ మాధవ బి.మల్లియా అన్నారు . గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ ‘ ‘ రేడియోకెమిస్ట్రీ , అప్లికేషన్స్ ఆఫ్ రేడియో ఐసోటోప్స్’పై నిర్వహిస్తున్న ఐదురోజుల జాతీయ వర్క్షాప్లో మంగళవారం ఆయన ‘ రేడియో ఐసోటోప్ ప్రొడక్షన్’పై ఉపన్యసించారు . కేవలం ఆరు గంటల జీవితకాలంతో టెక్నీషియం -99 ఎం , 66 గంటలు మనగల మాలిబ్దినం -99 వంటి రేడియో ఐసోటోప్లు రోగ నిర్ధారణలో చాలా ముఖ్యమైనవన్నారు . న్యూక్లియర్ మెడిసిన్లో ‘ వర్క్ హార్స్’గా పిలువబడే టెక్నాషియం -99 ఎంను వినియోగించి దాదాపు 80 శాతానికి పైగా రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ఆయన వెల్లడించారు .
అంతేకాక , ఈ రేడియో ఐసోటోప్లను జలశాస్త్రం , జీవశాస్త్రం , ఆరోగ్య సంరక్షణ , భౌతిక రసాయన శాస్త్రాలతో పాటు పరిశ్రమ , ఫుడ్ టెక్నాలజీ , వ్యవసాయంలో కూడా వినియోగిస్తున్నట్టు ఆయన చెప్పారు . ఈ రేడియో ఐసోటోప్లను ఇంజెక్ట్ చేయడం ద్వారా భూగర్భంలో పెట్రోలియం పెపు లీకేజీని కూడా గుర్తించవచ్చన్నారు . ఈ సందర్భంగా సదస్యులు సంధించిన పలు ప్రశ్నలకు ఆయన సందర్భోచిత జనాబులిచ్చి ఆకట్టుకున్నారు . అంతకు మునుపు , ‘ న్యూక్లియర్ స్టెబిలిటీ , స్ట్రక్చర్ ‘ అనే అంశంపై బార్క్ రేడియోకెమిస్ట్రీ , అనలిటికల్ కెమిస్ట్రీ విభాగంలో పనిచేసిన డాక్టర్ ఏవీఆర్ రెడ్డి , ‘ సదార్థంతో రేడియేషన్ ఇంటరాక్షన్ ‘ అనే అంశంపై బార్క్ లోని రేడియోకెమిస్ట్రీ విభాగానికి చెందిన డాక్టర్ ధనదీప్ దత్తా ప్రసంగించారు . సోమవారం నాడు ఆరంభమైన ఈ కార్యశాల మరో మూడు రోజుల పాటు కొనసాగనుంది .
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…