పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పరిశ్రమ-విద్యా సంస్థ సమన్వయంలో భాగంగా, గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ (ఎస్ వోసీ) విద్యార్థులు. గురువారం హెదరాబాద్ లోని కేంద్రీయ ఔషధ, సుగంధ మొక్కల సంస్థ (సీఎస్ఐఆర్-సీఏఎంఏపీ)ని సందర్శించారు. ఫార్మసీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీ.ఎస్.కుమార్ మార్గదర్శనంలో డాక్టర్ ఎం.విన్యాస్ ఏర్పాటు చేసిన ఈ విద్యా పర్యటనలో దాదాపు 80 నుండి విద్యార్థులు, పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు.కేంద్రీయ ఔషధ, సుగంధ మొక్కల సంస్థ శాస్త్రవేత్తలు తమ తోటలోని వివిధ ఔషధ మొక్కల గురించి.విద్యార్థులకు వివరించారు. వారు ప్రధానంగా నిమ్మగడ్డి, సిట్రోనెల్లా, నెటినర్ గడ్డి, అశ్వగంధ, సెన్నా, కర్నేస్, మెంత,సరస్వతి, బ్రాహ్మి, గిలోయ్, మలబార్ నట్, రేవోల్సియా వంటి పలు ఔషధ మొక్కల విశేషాలు, వారి ప్రాముఖ్యతలనుతెలియజేశారు. తమ తోటలో పెరుగుతున్న మొక్కల జాతులు, వన మూలికలు, తీగలు, వాటిని పెంచే పద్ధతులను శాస్త్రవేత్త డాక్టర్ జ్ఞానేశ విద్యార్థులకు వివరించారు.
సీఐఎంఏసీ ప్రయోగశాలల్లోని ఆధునిక పరికరాలు, క్లీనెంజర్ ఉపకరణం, సాక్స్ట్ ఎక్స్ ట్రాక్టర్, గ్యాస్ -క్రోమాటోగ్రఫీ, మాస్ స్పెక్ట్రోస్కోపీ (జీఎస్-ఎంఎస్), హె-ఫెర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమాటోగ్రఫీ (హెచ్ పీ ఎస్సీ), సుగంధ నూనెలను వెలికితీసే సాంకేతికతల గురించి మరో శాస్త్రవేత్త డాక్టర్ సత్య శ్రీనివాస్ విశదీకరించారు. కాగా, డిస్టిలేషన్ యూనిట్ల గురించి, సుగంధ మొక్కల నుంచి నూనె వెలికితీసే వివిధ పద్ధతులను శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ బాబు. తెలియజేశారు.ఫార్మసీ విద్యార్థులు శాస్త్రవేర్తలను అడిగి పలు సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఫార్మసీ అధ్యాపకులు. డాక్టర్ విన్యాస్, డాక్టర్ జితేంద్ర పటేల్ తదితరులు శాస్త్రవేత్తలతో సంభాషించారు. వారికి కృతజ్ఞతా పూర్వ జ్ఞాపికను అందజేశారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…