Telangana

సీఏఎంఏపీని సందర్శించిన గీతం ఫార్మసీ విద్యార్థులు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

పరిశ్రమ-విద్యా సంస్థ సమన్వయంలో భాగంగా, గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ (ఎస్ వోసీ) విద్యార్థులు. గురువారం హెదరాబాద్ లోని కేంద్రీయ ఔషధ, సుగంధ మొక్కల సంస్థ (సీఎస్ఐఆర్-సీఏఎంఏపీ)ని సందర్శించారు. ఫార్మసీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీ.ఎస్.కుమార్ మార్గదర్శనంలో డాక్టర్ ఎం.విన్యాస్ ఏర్పాటు చేసిన ఈ విద్యా పర్యటనలో దాదాపు 80 నుండి విద్యార్థులు, పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు.కేంద్రీయ ఔషధ, సుగంధ మొక్కల సంస్థ శాస్త్రవేత్తలు తమ తోటలోని వివిధ ఔషధ మొక్కల గురించి.విద్యార్థులకు వివరించారు. వారు ప్రధానంగా నిమ్మగడ్డి, సిట్రోనెల్లా, నెటినర్ గడ్డి, అశ్వగంధ, సెన్నా, కర్నేస్, మెంత,సరస్వతి, బ్రాహ్మి, గిలోయ్, మలబార్ నట్, రేవోల్సియా వంటి పలు ఔషధ మొక్కల విశేషాలు, వారి ప్రాముఖ్యతలనుతెలియజేశారు. తమ తోటలో పెరుగుతున్న మొక్కల జాతులు, వన మూలికలు, తీగలు, వాటిని పెంచే పద్ధతులను శాస్త్రవేత్త డాక్టర్ జ్ఞానేశ విద్యార్థులకు వివరించారు.

సీఐఎంఏసీ ప్రయోగశాలల్లోని ఆధునిక పరికరాలు, క్లీనెంజర్ ఉపకరణం, సాక్స్ట్ ఎక్స్ ట్రాక్టర్, గ్యాస్ -క్రోమాటోగ్రఫీ, మాస్ స్పెక్ట్రోస్కోపీ (జీఎస్-ఎంఎస్), హె-ఫెర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమాటోగ్రఫీ (హెచ్ పీ ఎస్సీ), సుగంధ నూనెలను వెలికితీసే సాంకేతికతల గురించి మరో శాస్త్రవేత్త డాక్టర్ సత్య శ్రీనివాస్ విశదీకరించారు. కాగా, డిస్టిలేషన్ యూనిట్ల గురించి, సుగంధ మొక్కల నుంచి నూనె వెలికితీసే వివిధ పద్ధతులను శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ బాబు. తెలియజేశారు.ఫార్మసీ విద్యార్థులు శాస్త్రవేర్తలను అడిగి పలు సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఫార్మసీ అధ్యాపకులు. డాక్టర్ విన్యాస్, డాక్టర్ జితేంద్ర పటేల్ తదితరులు శాస్త్రవేత్తలతో సంభాషించారు. వారికి కృతజ్ఞతా పూర్వ జ్ఞాపికను అందజేశారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago