విద్యార్థులు విద్యతో పాటు విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి – సినీనటుడు తనికెళ్ళ భరణి
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
విద్యతో పాటు విజ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని సినీనటుడు,రచయిత,దర్శకుడు తనికెళ్ళ భరణి అన్నారు .సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని రెసోనెన్స్ గురుకుల స్కూల్ వార్షికోత్సవ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తల్లిదండ్రుల తర్వాత గురువుకు పెద్దలు రెండో స్థానాన్ని ఇచ్చారని చదువు చెప్పిన గురువులను గౌరవించుకోవాలని హితవు పలికారు .ఈ సందర్భంగా రెసోనెన్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, తెలంగాణ & ఏపీ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ ఈ వేడుక విజయాలను గుర్తించడమే కాకుండా ఉత్సాహంతో జరుపుకునే ఒక ప్రయాణం అన్నారు. అంకితభావం కలిగిన ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. విద్యార్థులకు మార్గనిర్దేశం చేయడంలో, స్ఫూర్తిని నింపడంలో ముందుంటున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ పూర్తి సామర్థ్యాన్ని చేరుకునేలా చేస్తున్నారన్నారు. వాళ్ల అచంచలమైన నిబద్ధత మా విజయానికి మూలస్తంభం అన్నారు.
రెసోనెన్స్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లో ప్రేరణ, సంరక్షణ అనేవి కేవలం సంచలన పదాలు మాత్రమే కాదని, అవి మా విధానంలో అంతర్భాగాలని తెలిపారు. విద్యార్థులను విద్యాపరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఎదగడానికి ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ‘మీలో ప్రతి ఒక్కరూ మన గొప్ప కథలో ఓ అంతర్భాగం, ఈ ఆనందోత్సవాన్ని ముందుకు తీసుకెళ్దాం, ఉజ్వల భవిష్యత్తును సృష్టిద్దాం. ఈ అద్భుత ప్రయాణంలో మీరు ఓ ముఖ్యమైన భాగమైందందుకు హృదయపూర్వక ధన్యవాదాలు’ అని తెలిపారు.’రెసో దర్పణ్’లో విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. ప్రతిభ కనబర్చిన వారికి అవార్డులతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రెసోనెన్స్ ఇన్స్టిట్యూషన్స్ తెలంగాణ అకడమిక్ డీన్ విద్యాసాగర్, మార్కెటింగ్ మేనేజర్ మార్కండేయులు, జనరల్ మేనేజర్ మల్లేశ్, జోనల్ ఇన్ఛార్జ్ వాణి, ప్రిన్సిపాల్ రామకృష్ణ రెడ్డి, ఉపాధ్యాయులు, 1200 విద్యార్థులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…