పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో జాతీయ స్థాయి ఐడియా పీచింగ్ పోటీ స్మార్ట్ ఐడియాథాన్-2023’ని ఆగస్టు 24-25 తేదీలలో నిర్వహించనున్నట్టు నిర్వాహకులు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. స్టార్టప్ ఇండియా, నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీల సంయుక్త సౌజన్యంతో దీనిని నిర్వహిస్తున్నామని తెలిపారు. సామాజిక ఆవిష్కరణల ద్వారా స్థిరమైన, స్థితిస్థాపకంగా ఉండే కమ్యూనిటీలను నిర్మించడంలో సహాయపడే స్టార్టన్లలో పనిచేయడానికి విద్యార్థులను ప్రోత్సహించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశంగా వారు పేర్కొన్నారు.ఇందులో ఎంపికైన వారికి బూట్ క్యాంపులు, శిక్షణ శిబిరాలను నిర్వహించి, వారి ఆలోచనలను చక్కగా తీర్చిదిద్దేందుకు గాను అంతర్జాతీయంగా శిక్షణ పొందిన వెంచర్ కోచ్ ద్వారా కోచింగ్ ఇస్తామని తెలియజేశారు.ఇందులో ఆకర్షణీయమైన నగదు పురస్కారాలు, గ్రాంట్లు (దాదాపు 30 లక్షల రూపాయల వరకు) ఉన్నాయని, సెమీ-ఫెన్టల్కు చేరుకునే 32 జట్లకు గీతం హెదరాబాద్ స్పాన్సర్ చేస్తుందని, రెల్లు ప్రయాణం, మూడు:రోజుల పాటు ఆహారం, వసతి సౌకర్యాలను కలుగజేస్తుందని వారు వివరించారు. ఇందులో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నవారు, జూన్ 10వ తేదీలోగా తమ ప్రతిపాదనలను పంపాలని, మరిన్నివివరాల కోసం: https://smartideathon gitam eduను సందర్శించాలని, smartideathon@gilam.eduకు ఈ-మెయిల్ చేయాలని, లేదా https://rb qy/308bpను క్లిక్వేసి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…