Telangana

చివరి దశలో మన ఊరు మన బడి పనులు

_పనుల పురోగతిపై ఎమ్మెల్యే సమీక్ష సమావేశం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ప్రభుత్వ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మన ఊరి మనబడి కార్యక్రమం ద్వారా పటాన్చెరు నియోజకవర్గంలో చేపట్టిన పనులు తుది దశకు చేరుకున్నాయని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.మన ఊరు మన బడి ద్వారా చేపట్టిన పనుల పురోగతిపై మంగళవారం ఉదయం పటాన్చెరు మండల పరిషత్ సమావేశం మందిరంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గంలో మొదటి విడతలో ఎంపికైన 55 పాఠశాలల్లో చేపట్టిన పనులు శరవేగంగా సాగుతున్నాయని, ఇప్పటికే 20 పాఠశాలలో పనులు పూర్తికాగా, మరో 35 పాఠశాలల్లో చివరి దశలో ఉన్నాయని తెలిపారు.

గుమ్మడిదల మండల పరిధిలో 8 పాఠశాలలు, జిన్నారం మండల పరిధిలో 15, అమీన్పూర్ మండల పరిధిలో 8, పటాన్చెరు మండల పరిధిలో 14, రామచంద్రపురం మండల పరిధిలో 10 పాఠశాలలను ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. వచ్చేనెల 12వ తేదీ లోపు పనులు పూర్తిచేసి, ఆయా పాఠశాలలకు అప్పగించాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. నిధుల కొరత ఉంటే వెంటనే సంప్రదించాలని సూచించారు. ప్రభుత్వ లక్ష్యం 100% విజయం సాధించాలంటే సంపూర్ణంగా సహకరించాలని కోరారు.అమీన్పూర్ మండల పరిధిలోని కిష్టారెడ్డిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనులు మందకోడిగా సాగడంపై సంభందిత కాంట్రాక్టర్ పై ఎమ్మెల్యే జిఎంఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయకపోతే బ్లాక్ లిస్టులో పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని దిగ్విజయవంతం చేయాలని కోరారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక వసతులతో కూడిన మౌలిక వసతులు కల్పించి, ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం మన ఊరు మనబడి కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, జెడ్పిటిసిలు సుధాకర్ రెడ్డి, కుమార్ గౌడ్, ఎంపీపీ దేవానందం, కార్పొరేటర్లు, మెట్టు కుమార్ యాదవ్ పుష్ప నగేష్, మున్సిపల్ చైర్మన్ లలితా సోమిరెడ్డి, వైస్ చైర్మన్ రాములు గౌడ్, నరసింహా గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago