Telangana

చివరి దశలో మన ఊరు మన బడి పనులు

_పనుల పురోగతిపై ఎమ్మెల్యే సమీక్ష సమావేశం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ప్రభుత్వ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మన ఊరి మనబడి కార్యక్రమం ద్వారా పటాన్చెరు నియోజకవర్గంలో చేపట్టిన పనులు తుది దశకు చేరుకున్నాయని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.మన ఊరు మన బడి ద్వారా చేపట్టిన పనుల పురోగతిపై మంగళవారం ఉదయం పటాన్చెరు మండల పరిషత్ సమావేశం మందిరంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గంలో మొదటి విడతలో ఎంపికైన 55 పాఠశాలల్లో చేపట్టిన పనులు శరవేగంగా సాగుతున్నాయని, ఇప్పటికే 20 పాఠశాలలో పనులు పూర్తికాగా, మరో 35 పాఠశాలల్లో చివరి దశలో ఉన్నాయని తెలిపారు.

గుమ్మడిదల మండల పరిధిలో 8 పాఠశాలలు, జిన్నారం మండల పరిధిలో 15, అమీన్పూర్ మండల పరిధిలో 8, పటాన్చెరు మండల పరిధిలో 14, రామచంద్రపురం మండల పరిధిలో 10 పాఠశాలలను ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. వచ్చేనెల 12వ తేదీ లోపు పనులు పూర్తిచేసి, ఆయా పాఠశాలలకు అప్పగించాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. నిధుల కొరత ఉంటే వెంటనే సంప్రదించాలని సూచించారు. ప్రభుత్వ లక్ష్యం 100% విజయం సాధించాలంటే సంపూర్ణంగా సహకరించాలని కోరారు.అమీన్పూర్ మండల పరిధిలోని కిష్టారెడ్డిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనులు మందకోడిగా సాగడంపై సంభందిత కాంట్రాక్టర్ పై ఎమ్మెల్యే జిఎంఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయకపోతే బ్లాక్ లిస్టులో పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని దిగ్విజయవంతం చేయాలని కోరారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక వసతులతో కూడిన మౌలిక వసతులు కల్పించి, ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం మన ఊరు మనబడి కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, జెడ్పిటిసిలు సుధాకర్ రెడ్డి, కుమార్ గౌడ్, ఎంపీపీ దేవానందం, కార్పొరేటర్లు, మెట్టు కుమార్ యాదవ్ పుష్ప నగేష్, మున్సిపల్ చైర్మన్ లలితా సోమిరెడ్డి, వైస్ చైర్మన్ రాములు గౌడ్, నరసింహా గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

admin

Recent Posts

కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయం నుండి డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టండి

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి ని కోరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:…

30 minutes ago

డిఆర్డిఏ, మెప్మ, రెవెన్యూ, ఎక్సైజ్, హెచ్ఎండిఎ శాఖల అధికారులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష

మహిళా సంఘాల ఆర్థిక అభ్యున్నతికి పెద్దపీట మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్, రైస్ మిల్ ఏర్పాటుకు త్వరలో భూమి…

34 minutes ago

నైపుణ్యాభివృద్ధికి గీతం పెద్దపీట

అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో విద్యార్థులకు మార్గనిర్దేశం మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగంలో విద్యార్థులకు…

42 minutes ago

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

16 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago