పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్లోని రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని సి.సంధ్యను డాక్టరేట్ వరించింది, ‘సర్యావరణ, జీవసంబంధ అనువర్తనాల కోసం మెటల్, మెటల్ ఆక్సెడ్ సూక్ష్మ-సమ్మేళనాలు’ అనే అంశంపై అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు.ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ లోని రసాయన శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వెంకట నాగేంద్ర కుమార్ పుట్టా శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. హైదరాబాద్ లోని సీఎస్ ఐఆర్-ఐఐసీటీ చీఫ్ సెంటిస్ట్ (రిటెర్డ్) ప్రొఫెసర్ శ్రీధర్ బొజ్జా బాహ్య పరిశీలకుడిగా వ్యవహరించినట్టు తెలిపారు.సంధ్య తన సంచలనాత్మక సిద్ధాంత వ్యాసంలో, మొక్కల సారాలను ఉపయోగించి మెటల్, మెటల్ ఆక్సెడ్, మెబల్ ఫెర్రెట్ట్ సూక్ష్మ-సమ్మేళనాలను సంశ్లేషణ చేయడంలో పర్యావరణ హిత రసాయన సూత్రాల వినూత్న అనువర్తనాలను అన్వేషించినట్టు పేర్కొన్నారు. ఈ అధ్యయనం పర్యావరణ, జీవసంబంధమైన రంగాలలో స్థిరమైన విధానాలు, వాటి అనువర్తనాల ప్రాముఖ్యతను నొక్కి చెబుతోందన్నారు.వివిధ మొక్కల మూలాల నుంచి నానో-సమ్మేళనాల ఆకుసచ్చ సంశ్లేషణను ప్రస్పుటం చేస్తుందని, వాటి ఎంపిక, సున్నితత్వం, బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శిస్తుందని తెలిపారు. ఈ బయోసింథసెజ్డ్ పదార్థాలు విషపదార్థాలను తొలగిస్తాయని, ఉత్ప్రేరక, బయోమెడికల్ రంగాలలో బాగా ఉపయోగపడతాయని ఈ పరిశోధనలో తేలిందన్నారు.సంధ్య సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్ డీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం, హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీఏవీఎస్ఆర్ నర్మ, సలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: క్వాంటం టెక్నాలజీల కోసం షట్కోణ బోరాన్ నైట్రైడ్ లో రుణాత్మక ఆవేశం గల ఏక…
తెల్లాపూర్ ‘జి. ఎల్లయ్య ఎన్క్లేవ్’లో ఎల్లన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన హరీశ్ రావు పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మారబోయిన రఘునాథ్ యాదవ్ ను తెలంగాణ…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ‘అధునాతన భావనలు, బోధనా పద్ధతులు, విద్యా సాధనాలు’ అనే అంశంపై భౌతికశాస్త్ర ఉపాధ్యాయుల కోసం…
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి ని కోరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:…
మహిళా సంఘాల ఆర్థిక అభ్యున్నతికి పెద్దపీట మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్, రైస్ మిల్ ఏర్పాటుకు త్వరలో భూమి…