పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
లలిత కళలు, వాటి ప్రాముఖ్యతను తెలియజేసే లక్ష్యంతో గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ ‘ప్రదర్శనాత్మక భారతం’ (పెర్ఫార్మేటివ్ ఇండియా) పేరిట ఈనెల 27న ఒకరోజు జాతీయ సదస్సును నిర్వహించనున్నది. ఈ విషయాన్ని లలిత కళలు విభాగం సమన్వయకర్త, సదస్సు నిర్వాహకురాలు డాక్టర్ మెథైలి మరాట్ అనూప్ శుక్రవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వెల్లడించారు.హెదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని ఎస్.ఎన్. స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ నృత్య విభాగం ప్రొఫెసర్, నటి డాక్టర్ అరుణ భిక్షు ముఖ్య వక్తగా పాల్గొంటారని తెలియజేశారు. ఐఐటీ బాంబేలోని భాష-సాహిత్య అధ్యయనాల విశ్రాంత ఆచార్యుడు, హిందుస్తానీ శాస్త్రీయ గాయకుడు డాక్టర్ మిలింద్ మల్లే మరో వక్తగా పాల్గొంటారన్నారు.’సమకాలీన కాలంలో ప్రదర్శనల సౌందర్యం: డిజిటల్ యుగంలో వాటి తీరుతెన్నులు’ అనే అంశంపై నిర్వహించనున్న చర్చాగోష్ఠిలో ఐఐటీ హైదరాబాద్ లోని డిజెన్డ్ విభాగానికి చెందిన డాక్టర్ దీపక్ జాన్ మాథ్యూ; కేరళకు చెందిన ప్రముఖ థియేటర్ ప్రాక్టీషనర్ ప్రొఫెసర్ చంద్ర దాసన్; సిలికాన్ ఆంధ్రా విశ్వవిద్యాలయం-త్రిబుల్ ఐటీ హెదరాబాద్ లోని సంగీత విభాగం అధ్యాపకులు డాక్టర్ టీకేఎల్ సరోజలు పాల్గొంటారని ఆమె వివరించారు.యునెస్కో గుర్తింపు పొందిన సాంప్రదాయ భారతీయ కళారూపం ‘కుటియాట్టం’ను సదస్సు ముగింపు సమయంలో ప్రదర్శిస్తారని డాక్టర్ మెథైలి తెలిపారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: వ్యర్థాల నుంచి సంపద (శ్రేయస్సు)ను సృష్టిస్తున్న హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయాన్ని బుధవారం ఐఐటీ…
ప్రతిష్టాత్మక సదస్సులో కీలకోపన్యాసం చేసిన సీఎస్ఈ అధ్యాపకురాలు ప్రొఫెసర్ ప్రీతి పర్వేకర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం డీమ్డ్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: పటాన్చెరు నియోజకవర్గం పరిధిలో నూతన దేవాలయాల నిర్మాణం, పురాతన దేవాలయాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని ఈఈసీఈ విభాగం ఆధ్వర్యంలో జనవరి 19 నుంచి 23 వరకు…
ఆతిథ్య ఉపన్యాసంలో పేర్కొన్న ఐఐటీ హైదరాబాదు అధ్యాపకుడు డాక్టర్ ప్రభాత్ కుమార్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రకృతి, భౌతికశాస్త్రం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: పటాన్చెరు నియోజకవర్గం, ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని ఐనోలు గ్రామంలో సోమవారం శ్రీశ్రీశ్రీ మల్లికార్జున స్వామి…