మనవార్తలు ,పటాన్ చెరు:
భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హెదరాబాద్ ప్రాంగణంలో ‘ ఇంజనీర్స్ దినోత్సవాన్ని ‘ గురువారం ఘనంగా నిర్వహించారు . హైదరాబాద్ లోని బీహెచ్ఎల్ డిప్యూటీ మేనేజర్ , ఫోరమ్ టు ఇంప్రూవ్ థింగ్స్ ( ఎఫ్ఎస్ఐటీ ) ప్రధాన కార్యదర్శి ఎం . భగత్సింగ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు . సర్ విశ్వేశ్వరయ్య అసమాన సేవలను స్మరించుకోవడంతో పాటు , వర్ధమాన ఇంజనీర్లను ప్రోత్సహించడం , తద్వారా వారు ఉన్నతస్థాయికి ఎదిగేలా ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు పేర్కొన్నారు . స్మార్ట్ క్లబ్ ప్రారంభం ఎలక్ట్రికల్ , ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ ( ఈఈసీఈ ) విభాగంలో ‘ జి – ఎలక్ట్రా ‘ పేరుతో స్మార్ట్ సిస్టమ్స్ క్లబ్ల్ను ప్రొఫెసర్ డీఎస్ రావు ప్రారంభించారు . ఆ క్లబ్ విద్యార్థులు ప్రదర్శించిన రెస్క్యూ రోబోట్ , బ్లెండెన్ విజన్ , స్మార్ట్ పార్కింగ్ , మూగ చెవిటి వారికి ఉపకరించే ‘ సహాయ్ – యంత్రిన్ ‘ , ఫ్యాను – బల్బులను రిమోట్ కంట్రోల్తో నియంత్రించే ‘ టెలిగ్రామ్ కంట్రోల్డ్ రూమ్ ‘ వంటి పలు మోడళ్ళను ఆయన సందర్శించి , వాటి పనితీరు గురించి వివరంగా అడిగి తెలుసుకున్నారు .
విద్యార్థులలో ఉత్సాహాన్ని ఇనుమడింపజేయడం , ప్రజా జీవనాన్ని మరింత సుఖమయం చేసే పరికరాలు , వివిధ గాడ్జెట్ల ఆటోమేషన్పై సాంకేతిక అన్వేషణకు పురిగొల్పడం లక్ష్యంగా ఈ క్లబ్ు ఏర్పాటు చేసినట్టు ఈఈసీఈ విభాగాధిపతి డాక్టర్ టి.మాధవి పేర్కొన్నారు . రక్తదాన శిబిరం ‘ ఇంజనీర్స్ డే’ని పురస్కరించుకుని చరెవైతి ( గీతం విద్యార్థి విభాగం ) భారత రెడ్ క్రాస్ సొసెట్టీతో కలిసి గురువారం రక్తదాన శిబిరాన్ని మంజీరా సెమినార్ హాల్లో నిర్వహించింది . తలసేమియాతో బాధపడుతున్న రోగులకు రక్తాన్ని అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో ఏర్పాటుచేసిన ఈ శిబిరంలో దాదాపు 300 మంది ఔత్సాహిక విద్యార్థులు రక్తాన్ని దానం చేశారు . ఇలాంటి మరిన్ని శిబిరాలను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని , పెద్దసంఖ్యలో విద్యార్థులు ముందుకొచ్చి ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని ప్రోవీసీ ప్రొఫెసర్ డీఎస్ రావు పిలుపు నిచ్చారు .
ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న రెడ్ క్రాస్ సొసెట్రీ డాక్టర్ జనార్దనరెడ్డి , ఇతర సిబ్బంది , నిర్వహిస్తున్న చరెవేతి విద్యార్థి విభాగాన్ని ఆయన అభినందించారు . ఈ కార్యక్రమాలలో గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య , ప్రొఫెసర్ కె . మంజునాథాచారి , పలు విభాగాధిపతులు , అధ్యాపకులు , విద్యార్థులు పాల్గొన్నారు