Telangana

గీతం ఆర్కిటెక్చర్ విద్యార్థుల విద్యా అధ్యయన పర్యటన

ఆగ్రా, జైపూర్, జైసల్మేర్, జోధ్ పూర్, ఢిల్లీలను సందర్శించి, మనదేశ నిర్మాణ వారసత్వ పరిశీలన

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ మూడవ ఏడాది విద్యార్థులు రెండు వారాల పాటు ఉత్తర భారతదేశంలో విద్యా అధ్యయన పర్యటనను చేశారు హైదరాబాద్, విశాఖపట్నం ప్రాంగణాల ఆర్కిటెక్చర్ విద్యార్థులు తమ అధ్యాపకులతో కలిసి ఆగ్రా, జైపూర్, జైసల్మేర్, జోధ్ పూర్, ఢిల్లీ వంటి చారిత్రాత్మక నగరాలను పర్యటించి, భారతదేశ గొప్ప నిర్మాణ వారసత్వాన్ని లోతుగా పరిశీలించారు. ఈ విషయాన్ని ఆర్కిటెక్చర్ స్కూల్ డైరెక్టర్ బందన్ కుమార్ మిశ్రా మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు.జాగ్రత్తగా రూపొందించిన ఈ పర్యటన విద్యార్థులకు మొఘల్ వైభవం నుంచి రాజపుత్ క్లిష్టత, సమకాలీన ఆవిష్కరణల వరకు విభిన్న శ్రేణి నిర్మాణ శైలులను అధ్యయనం చేయడానికి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందించింది.

ఈ పర్యటనలో ముఖ్యమైన అంశం, జైపూర్ లోని అయోజన్ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో విద్యా మార్పిడి. అక్కడి విద్యార్థులతో ఆలోచనలను రేకెత్తించే చర్చలు, సహకార అభ్యాసంలో పాల్గొని, అంతర్-సంస్థాగత జ్జాన భాగస్వామ్యాన్ని పెంపొందించుకున్నారు.ఆ తరువాత, జైసల్మేర్ లోని రాజకుమారి రత్నవతి బాలికల పాఠశాల సందర్శన అద్భుతమైన అనుభవాలలో ఒకటి. ఇది స్థిరమైన నిర్మాణ శైలికి స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ. స్థానిక బాలికలను విద్య ద్వారా శక్తివంతం చేయడానికి రూపొందించబడిన ఈ సంస్థ, పర్యావరణ స్పృహతో కూడిన డిజైన్ యొక్క పరివర్తన ప్రభావాన్ని చూపడమే గాక, సామాజిక మార్పును నడిపించడంలో వాస్తు శిల్పం పాత్రను విశదీకరిస్తోంది.తరగతి గది అభ్యాసానికి మించి, ఈ అధ్యయన పర్యటన విద్యార్థులకు సాంప్రదాయ, ఆధునిక నిర్మాణ పద్ధతులపై సమగ్ర దృక్పథాన్ని అందించింది.

సమకాలీన అనువర్తనాలతో చారిత్మక అంతర్దృష్టులను అనుసంధా నించడం ద్వారా, ఈ ప్రయాణం వారి విద్యా కార్యకలాపాలను సుసంపన్నం చేసింది. సంస్కృతి, సమాజాలపై వాస్తుశిల్పం యొక్క లోతైన ప్రభావం పట్ల వారిలో ఆలోచనలను రేకెత్తించింది.ఈ స్వీయ పరిశీలానుభవం గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ యొక్క ఆచరణాత్మక అభ్యాసం, విశ్వశ్రేణి అవగాహనలపై దాని నిబద్ధతను చాటి చెబుతోంది. జ్జాన దృష్టితో భవిష్యత్తును రూపొందించే, ముందు చూపుతో యోచించే వాస్తుశిల్పులుగా మారడానికి విద్యార్థులను సిద్ధం చేస్తోంది.

admin

Recent Posts

గీతంలో క్వాంటం సాంకేతికపై పరిశోధన

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: క్వాంటం టెక్నాలజీల కోసం షట్కోణ బోరాన్ నైట్రైడ్ లో రుణాత్మక ఆవేశం గల ఏక…

16 hours ago

నిజాయితీ, నిబద్ధత కలిగిన నిస్వార్థ నాయకుడు స్వర్గీయ జి. ఎల్లన్న: మాజీ మంత్రి హరీశ్ రావు

తెల్లాపూర్ ‘జి. ఎల్లయ్య ఎన్‌క్లేవ్’లో ఎల్లన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన హరీశ్ రావు పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ…

16 hours ago

రఘునాథ్ యాదవ్ కు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నేతలు

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మారబోయిన రఘునాథ్ యాదవ్ ను తెలంగాణ…

2 days ago

గీతంలో ముగిసిన భౌతికశాస్త్ర ఉపాధ్యాయుల శిక్షణ

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ‘అధునాతన భావనలు, బోధనా పద్ధతులు, విద్యా సాధనాలు’ అనే అంశంపై భౌతికశాస్త్ర ఉపాధ్యాయుల కోసం…

2 days ago

కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయం నుండి డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టండి

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి ని కోరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:…

3 days ago

డిఆర్డిఏ, మెప్మ, రెవెన్యూ, ఎక్సైజ్, హెచ్ఎండిఎ శాఖల అధికారులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష

మహిళా సంఘాల ఆర్థిక అభ్యున్నతికి పెద్దపీట మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్, రైస్ మిల్ ఏర్పాటుకు త్వరలో భూమి…

3 days ago