ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా గణేష్ గడ్డ సిద్ది వినాయక దేవాలయం

politics Telangana

_కోటి 50 లక్షల రూపాయల సొంత నిధులతో మూడు రాజ గోపురాల నిర్మాణం

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :

రుద్రారం శ్రీ సిద్ది గణపతి దేవాలయాన్ని రాష్ట్రంలోనే ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని దేవాలయ అభివృద్ధిలో భాగంగా ఒక కోటి 50 లక్షల రూపాయల సొంత నిధులతో మూడు రాజగోపురాల నిర్మాణ పనులకు సోమవారం ఉదయం పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి దంపతులు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎంతో ప్రాశస్త్యం పొందిన సిద్ధి గణపతి దేవాలయాన్ని అంచలంచలుగా అభివృద్ధి పరుస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 50 లక్షల రూపాయల సొంత నిధులను అయ్యప్ప, శివ, ఆంజనేయ స్వామి భక్తుల కోసం ధ్యాన మందిర నిర్మాణ పనులకు కేటాయించామని తెలిపారు.రోజురోజుకీ ఆలయాన్ని దర్శించే వారి భక్తుల సంఖ్య పెరుగుతోందని, ఇందుకు అనుగుణంగా ఆలయాన్ని అభివృద్ధి పరుస్తున్నట్లు తెలిపారు.

నియోజకవర్గంలోని పురాతన ఆలయాలను జీర్ణోధారణ చేయడంతో పాటు, నూతన దేవాలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, అమీన్పూర్ జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఎంపీటీసీ రాజు, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, మాణిక్ రెడ్డి, రాజు, పార్టీ మండల అధ్యక్షులు పాండు, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ నరసింహారెడ్డి, ఈవో మోహన్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *