పటాన్ చెరు:
జాతిపిత మహాత్మా గాంధీ 152 వ జయంతి ఉత్సవాలను గీతం డీమ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ లో శనివారం ఘనంగా నిర్వహించారు . గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డెరైక్టర్ ( ఇంజనీరింగ్ ) ప్రొఫెసర్ వీకే మిట్టల్ , రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , స్కూల్ ఆఫ్ సైన్స్ , ఆర్కిటెక్చర్ , ఫార్మశీ ప్రిన్సిపాళ్ళు ప్రొఫెసర్ జీఏ రామారావు , ప్రొఫెసర్ సునీల్ కుమార్ , ప్రొఫెసర్ జీఎస్ కుమార్ , బీ – స్కూల్ ప్రొఫెసర్ ఏ.శ్రీరామ్ తదితరులు గాంధీ స్క్వేర్ లో నెలకొల్పిన మహాత్ముని విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ , సత్యం , శాంతి , అహింసలకు గాంధీజీ ప్రాధాన్యం ఇచ్చి , ప్రపంచానికే మార్గదర్శకునిగా మారారని కొనియాడారు . గాంధీ త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు . గాంధీ మార్గాన్ని ప్రపంచ వ్యాప్తంగా అనుసరిస్తున్నామని , మనమంతా అదే మార్గంలో పయనించాలని , అదే జాతిపితకు మనమిచ్చే అసలైన నివాళని వారు అభిప్రాయపడ్డారు . మహాత్మా గాంధీకి పలువురు విభాగాధిపతులు , అధికారులు , అధ్యాపకులు , సిబ్బంది తదితరులు కూడా నివాళి అర్పించారు .
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…