Hyderabad

సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వైకుంఠ రథం విరాళం..

పటాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం గ్రామ పంచాయతీకి వైకుంఠ రథం విరాళంగా అందజేశారు. నీలం మధు తల్లిదండ్రులు స్వర్గీయ నీలం నిర్మల్, నీలం రాధా జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన వైకుంఠ రథాన్ని శుక్రవారం గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో ఆయన ప్రారంభించారు.

గ్రామ సభ…..

జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముది రాజ్ అధ్యక్షతన పంచాయతీ ఆవరణలో శనివారం గ్రామసభ నిర్వహించారు. ముందుగా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి సర్పంచ్ నీలం మధు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామ స్వరాజ్య స్థాపన దిశగా పాలన చేస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి ఆలోచన కనుగుణంగా సమిష్టి నిర్ణయాలతో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నట్టు పేర్కొన్నారు

జ్యూట్ బ్యాగుల శిక్షణ కేంద్రం ప్రారంభం…

చిట్కుల్ గ్రామంలోని మహిళా గ్రామైక్య సంఘం భవనంలో సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ సౌజన్యంతో మహిళలకు జ్యూట్ బ్యాగుల తయారీ కోసం శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. శనివారం సర్పంచ్ నీలం మధు ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40 మంది మహిళలకు జూట్ బ్యాగుల తయారీలో శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ బ్యాగుల బదులు జ్యూట్ బ్యాగులను వినియోగించాలని కోరారు. ప్లాస్టిక్ వాడకం మానవ మనుగడకు ప్రమాదకరమన్నారు. గ్రామపంచాయతీ పరిధిలో ప్లాస్టిక్ నిషేధంపై ప్రచారం చేసి ప్రజలను చైతన్య పరుస్తామన్నారు. ప్రతి ఒక్కరు జ్యూట్ బ్యాగులను వాడాలని ఆయన సూచించారు. ఈ మేరకు పంచాయతీలో తీర్మానం కూడా చేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి కవిత, ఎంపిటిసి మంజుల, వార్డు సభ్యులు దుర్గయ్య, వెంకటేష్, కృష్ణ, గౌరీ, భుజంగం, రాజ్ కుమార్, యాదగిరి, ఆంజనేయులు, గ్రేషియా జ్యుట్ క్రియేషన్స్ అధినేత్రి స్వర్ణ, మహిళా సంఘం అధ్యక్షురాలు మనీలా, సీసీ లక్ష్మి మహిళలు తదితరులు పాల్గొన్నారు.

చాకలి ఐలమ్మ విగ్రహానికి శంకుస్థాపన….

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ కాంస్య విగ్రహం ఏర్పాటు కోసం శనివారం చిట్కూల్ గ్రామ పరిధిలో సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ శంకుస్థాపన చేశారు. 5 లక్షల రూపాయలతో చాకలి ఐలమ్మ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ తెలిపారు.చాకలి వెంకటేశం. చాకలి కృష్ణ చాకలి సత్యనారాయణ. చాకలి యాదయ్య. చాకలి కుమార్. పాల్గొన్నారు.🙏

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

3 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

3 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

3 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago