పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే క్రీడా పోటీల ద్వారా వాతావరణం వెల్లివిరిస్తుందని రుద్రారం గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి అన్నారు . పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలో ఏర్పాటు చేసిన రుద్రారం ప్రీమియర్ లీగ్ సీజన్ 4 క్రికెట్ పోటీలు ఘనంగా ముగిసాయి. రుద్రారం ప్రీమియర్ లీగ్ పోటీలలో రన్నర్ విన్నర్ విజేతలకు 30 వేల రూపాయల మరియు 20 వేల రూపాయల ప్రైజ్ మనీ ట్రోఫీ బహుమతి అందజేశారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుద్రారం గ్రామ వ్యాప్తంగా క్రీడలను ప్రోత్సహించడంతో పాటు క్రీడాకారుల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. స్వతహాగా క్రీడాకారుడైన తాను క్రీడలు, క్రీడాకారుల అభివృద్ధికి ఎల్లప్పుడూ తోడ్పాటును అందిస్తున్నామని క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం, శారీరక వ్యాయామం లభిస్తుందని తెలిపారు.ప్రతి సంవత్సరం క్రికెట్ పోటీలు ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. భవిష్యత్తులోనూ నిర్వహించాలని రుద్రారం గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఎంపీటీసీలు మన్నే రాజు, హరి ప్రసాద్ రెడ్డి, ప్రముఖ సామాజిక సేవ నేత సాబాద సాయికుమార్, గ్రామ యువ నాయకుడు సత్యనారాయణ రెడ్డి, వార్డు సభ్యులు, క్రీడాకారులు ,గ్రామ ప్రజలు, వివిధ సంఘాల యువకులు, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: క్వాంటం టెక్నాలజీల కోసం షట్కోణ బోరాన్ నైట్రైడ్ లో రుణాత్మక ఆవేశం గల ఏక…
తెల్లాపూర్ ‘జి. ఎల్లయ్య ఎన్క్లేవ్’లో ఎల్లన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన హరీశ్ రావు పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మారబోయిన రఘునాథ్ యాదవ్ ను తెలంగాణ…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ‘అధునాతన భావనలు, బోధనా పద్ధతులు, విద్యా సాధనాలు’ అనే అంశంపై భౌతికశాస్త్ర ఉపాధ్యాయుల కోసం…
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి ని కోరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:…
మహిళా సంఘాల ఆర్థిక అభ్యున్నతికి పెద్దపీట మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్, రైస్ మిల్ ఏర్పాటుకు త్వరలో భూమి…